ETV Bharat / city

గుండె సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తలసాని

author img

By

Published : Jan 19, 2021, 3:18 PM IST

గుండెపోటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. చందానగర్​లోని పీఆర్​కే ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్​ను ప్రారంభించి, పరీక్షలు చేయించుకున్నారు.

minister thalasani srinivas yadav launched cath lab in prk hospital at chandanagar
గుండె సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తలసాని

ఛాతీనొప్పిని అశ్రద్ధ చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. గుండెపోటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చందానగర్​లోని పీఆర్‌కే ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్​ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి గుండె పరీక్షలు చేయించుకున్నారు.

తక్కువ ఖర్చుతో గుండెకు సంబంధించిన పరీక్షను పీఆర్​కే ఆసుపత్రిలోని క్యాథ్ ల్యాబ్​లో చేస్తున్నారని ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని తెలిపారు. గుండె పోటు వచ్చిన రోగులకు బ్లాక్స్ గుర్తించి, స్టంట్స్ వేయడం సులభతరమవుతుందని మంత్రి పేర్కొన్నారు. గుండెకు సంబంధించిన తక్కువ ఖర్చుతో తమ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామని హృద్రోగ నిపుణులు డాక్టర్ శివప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి: మరో 45 లక్షల డోసుల కొవాగ్జిన్​ కొనుగోలు!

ఛాతీనొప్పిని అశ్రద్ధ చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. గుండెపోటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చందానగర్​లోని పీఆర్‌కే ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్​ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి గుండె పరీక్షలు చేయించుకున్నారు.

తక్కువ ఖర్చుతో గుండెకు సంబంధించిన పరీక్షను పీఆర్​కే ఆసుపత్రిలోని క్యాథ్ ల్యాబ్​లో చేస్తున్నారని ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని తెలిపారు. గుండె పోటు వచ్చిన రోగులకు బ్లాక్స్ గుర్తించి, స్టంట్స్ వేయడం సులభతరమవుతుందని మంత్రి పేర్కొన్నారు. గుండెకు సంబంధించిన తక్కువ ఖర్చుతో తమ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామని హృద్రోగ నిపుణులు డాక్టర్ శివప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి: మరో 45 లక్షల డోసుల కొవాగ్జిన్​ కొనుగోలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.