ETV Bharat / city

Accident: సదర్​ ఉత్సవాల్లో వ్యక్తి పైకి దూసుకెళ్లిన మంత్రి తలసాని కుమారుడి కారు

author img

By

Published : Nov 5, 2021, 10:59 PM IST

హైదరాబాద్​లోని ఖైరతాబాద్​లో వైభవంగా జరిగిన సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో పాల్గొని వెళ్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కుమారుని కారు.. ఓ స్థానికునిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాధితుని కాలికి తీవ్రగాయమైంది.

tlasani sai yadav car accident case
tlasani sai yadav car accident case

హైదరాబాద్ ఖైరతాబాద్ సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని నిర్వహించే సదర్ ఉత్సవాల్లో... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ హాజరయ్యారు. వేడుకల్లో పాల్గొన్ని తిరిగి వెళ్తుండగా... ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన ఓ వ్యక్తి కాలుపై నుంచి కారు వెళ్లింది.

ఈ ఘటనలో కాలుకు తీవ్ర గాయం కాగా.. మంత్రి కుమారున్ని స్థానికులు అడ్డుకున్నారు. సాయియాదవ్​తో బాధితుని కుటుంబసభ్యులు, స్థానికులు వాగ్వాదానికి దిగారు. గొడవ తీవ్రం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుని కుటుంబానికి నచ్చ చెప్పిన పోలీసులు.. తమ వాహనంలోనే క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు.

సదర్​ ఉత్సవాల్లో వ్యక్తి పైకి దూసుకెళ్లిన మంత్రి తలసాని కుమారుడి కారు

హైదరాబాద్ ఖైరతాబాద్ సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని నిర్వహించే సదర్ ఉత్సవాల్లో... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ హాజరయ్యారు. వేడుకల్లో పాల్గొన్ని తిరిగి వెళ్తుండగా... ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన ఓ వ్యక్తి కాలుపై నుంచి కారు వెళ్లింది.

ఈ ఘటనలో కాలుకు తీవ్ర గాయం కాగా.. మంత్రి కుమారున్ని స్థానికులు అడ్డుకున్నారు. సాయియాదవ్​తో బాధితుని కుటుంబసభ్యులు, స్థానికులు వాగ్వాదానికి దిగారు. గొడవ తీవ్రం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుని కుటుంబానికి నచ్చ చెప్పిన పోలీసులు.. తమ వాహనంలోనే క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు.

సదర్​ ఉత్సవాల్లో వ్యక్తి పైకి దూసుకెళ్లిన మంత్రి తలసాని కుమారుడి కారు

ఇదీ చూడండి:

సదర్‌ ఉత్సవాల్లో దున్నపోతు బీభత్సం.. వాహనదారులపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.