ETV Bharat / city

Lemon price: నిమ్మకాయ పిండేస్తోంది... రెండు నెలలుగా మండుతున్న ధరలు

Lemon price: నిమ్మకాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. ఒక మోస్తరు కాయ, అందులోనూ రసం బాగా వచ్చేది కావాలంటే రూ.10పైనే పెట్టాలి. నాలుగు కొనాలంటే రూ.40 పైమాటే. నిమ్మ ధరలు ఏపీలో మునుపెన్నడూ లేని స్థాయికి చేరాయి. మే ఆఖరు దాకా ఇవే ధరలు కొనసాగుతాయనే అభిప్రాయం వ్యాపారవర్గాల్లో వ్యక్తమవుతోంది.

author img

By

Published : May 4, 2022, 2:42 PM IST

Increased lemon prices
ఆకాశానంటుతున్న నిమ్మ ధర

Lemon price: నాలుగు నిమ్మకాయలు కోసి.. ఆ రసాన్ని అన్నంలో కలిపేసి పులిహోర చేసే రోజులు పోయాయి. ఇప్పుడు పులిహోర కావాలంటే.. చింతపండు పులుసు కలపాల్సిందే. నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతుండటమే ఇందుకు కారణం. ఒక మోస్తరు కాయ, అందులోనూ రసం బాగా వచ్చేది కావాలంటే రూ.10పైనే పెట్టాలి. నాలుగు కొనాలంటే రూ.40 పైమాటే. నిమ్మధరలు ఏపీలో మునుపెన్నడూ లేని స్థాయికి చేరాయి.

ఒకదశలో కిలో రూ.180 దాకా ఎగబాకి, ప్రస్తుతం కాస్త దిగొచ్చింది. మే ఆఖరు దాకా ఇవే ధరలు కొనసాగుతాయనే అభిప్రాయం వ్యాపారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏపీలోని గూడూరు మార్కెట్లో రైతులు తెచ్చే నిమ్మకు రూ.50 నుంచి రూ.140 వరకు లభిస్తుండగా.. ఏలూరు, తెనాలి మార్కెట్లలో రూ.30 నుంచి రూ.70 మధ్య దక్కుతోంది. కాయలు చిన్నవిగా ఉంటే తక్కువ ధర లభిస్తోంది.

భారీవర్షాల ప్రభావమే కారణం.. ఏపీలో గతేడాది కురిసిన భారీవర్షాలు నిమ్మ రైతుల్ని దెబ్బతీశాయి. నవంబరులో భారీగా కురవడంతో.. ఏలూరు, తెనాలి ప్రాంతాల్లోని తోటల్లో పూత రాలిపోయింది. ఈ ప్రభావం కాపుపై పడింది. గుజరాత్‌, మహారాష్ట్రల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొనడంతో.. నిమ్మకాయల దిగుబడి పడిపోయింది. గూడూరు ప్రాంతంలో పూత పిందెగా మారాక వానలు కురిశాయి. దీంతో కాపు నిలబడింది. ప్రస్తుతం గూడూరు మార్కెట్‌కు రోజుకు 15 లారీల నిమ్మకాయలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. దిగుబడులు భారీగా తగ్గాయి.

గతంలో ఇదే సమయంలో 20 నుంచి 25 లారీల వరకు వచ్చేవని గూడూరుకు చెందిన వ్యాపారి రమణారెడ్డి చెప్పారు. ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌, దిల్లీ, జైపూర్‌, ఆగ్రా, లఖ్‌నవూ, వారణాసి, బిహార్‌, ఝార్ఖండ్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయని వివరించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరి మార్కెట్లో కిలోకు రూ.40 నుంచి రూ.60 మధ్య ధర లభిస్తోందని వ్యాపారి లక్ష్మీనరసయ్య తెలిపారు.

పంట ముందే కోసేస్తున్న రైతులు.. నిమ్మకాయల ధర ఆశాజనకంగా ఉండటంతో.. రైతులు ముందే కోస్తున్నారు. ఆలస్యం చేస్తే ధర పడిపోతుందేమోననే ఆందోళన పలువురిలో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌కు కొత్త పంట వస్తోంది. ఇవి చిన్నగా ఉండటం, రసం తక్కువగా వస్తుండటంతో కిలో రూ.50 నుంచి రూ.80 మధ్య ధర పలుకుతోంది. కొన్నిచోట్ల ఇంకా తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. పెద్దకాయలు, పండేందుకు సిద్ధంగా ఉన్నవైతే కిలో రూ.120 నుంచి రూ.150 వరకు లభిస్తోంది.

ఏలూరు, దెందులూరు ప్రాంతాల్లో రైతులకు కిలోకు రూ.30 నుంచి రూ.50 మాత్రమే లభిస్తోంది. కాయ పరిమాణం చిన్నగా ఉంటోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఉత్తర భారతదేశంలో వర్షాలు కురిస్తే.. ధరపై ప్రభావం పడుతుందని, తగ్గే అవకాశాలు ఉంటాయని వివరిస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో గాలివాన బీభత్సం.. అన్నదాతకు తీరని నష్టం

Lemon price: నాలుగు నిమ్మకాయలు కోసి.. ఆ రసాన్ని అన్నంలో కలిపేసి పులిహోర చేసే రోజులు పోయాయి. ఇప్పుడు పులిహోర కావాలంటే.. చింతపండు పులుసు కలపాల్సిందే. నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతుండటమే ఇందుకు కారణం. ఒక మోస్తరు కాయ, అందులోనూ రసం బాగా వచ్చేది కావాలంటే రూ.10పైనే పెట్టాలి. నాలుగు కొనాలంటే రూ.40 పైమాటే. నిమ్మధరలు ఏపీలో మునుపెన్నడూ లేని స్థాయికి చేరాయి.

ఒకదశలో కిలో రూ.180 దాకా ఎగబాకి, ప్రస్తుతం కాస్త దిగొచ్చింది. మే ఆఖరు దాకా ఇవే ధరలు కొనసాగుతాయనే అభిప్రాయం వ్యాపారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏపీలోని గూడూరు మార్కెట్లో రైతులు తెచ్చే నిమ్మకు రూ.50 నుంచి రూ.140 వరకు లభిస్తుండగా.. ఏలూరు, తెనాలి మార్కెట్లలో రూ.30 నుంచి రూ.70 మధ్య దక్కుతోంది. కాయలు చిన్నవిగా ఉంటే తక్కువ ధర లభిస్తోంది.

భారీవర్షాల ప్రభావమే కారణం.. ఏపీలో గతేడాది కురిసిన భారీవర్షాలు నిమ్మ రైతుల్ని దెబ్బతీశాయి. నవంబరులో భారీగా కురవడంతో.. ఏలూరు, తెనాలి ప్రాంతాల్లోని తోటల్లో పూత రాలిపోయింది. ఈ ప్రభావం కాపుపై పడింది. గుజరాత్‌, మహారాష్ట్రల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొనడంతో.. నిమ్మకాయల దిగుబడి పడిపోయింది. గూడూరు ప్రాంతంలో పూత పిందెగా మారాక వానలు కురిశాయి. దీంతో కాపు నిలబడింది. ప్రస్తుతం గూడూరు మార్కెట్‌కు రోజుకు 15 లారీల నిమ్మకాయలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. దిగుబడులు భారీగా తగ్గాయి.

గతంలో ఇదే సమయంలో 20 నుంచి 25 లారీల వరకు వచ్చేవని గూడూరుకు చెందిన వ్యాపారి రమణారెడ్డి చెప్పారు. ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌, దిల్లీ, జైపూర్‌, ఆగ్రా, లఖ్‌నవూ, వారణాసి, బిహార్‌, ఝార్ఖండ్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయని వివరించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరి మార్కెట్లో కిలోకు రూ.40 నుంచి రూ.60 మధ్య ధర లభిస్తోందని వ్యాపారి లక్ష్మీనరసయ్య తెలిపారు.

పంట ముందే కోసేస్తున్న రైతులు.. నిమ్మకాయల ధర ఆశాజనకంగా ఉండటంతో.. రైతులు ముందే కోస్తున్నారు. ఆలస్యం చేస్తే ధర పడిపోతుందేమోననే ఆందోళన పలువురిలో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌కు కొత్త పంట వస్తోంది. ఇవి చిన్నగా ఉండటం, రసం తక్కువగా వస్తుండటంతో కిలో రూ.50 నుంచి రూ.80 మధ్య ధర పలుకుతోంది. కొన్నిచోట్ల ఇంకా తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. పెద్దకాయలు, పండేందుకు సిద్ధంగా ఉన్నవైతే కిలో రూ.120 నుంచి రూ.150 వరకు లభిస్తోంది.

ఏలూరు, దెందులూరు ప్రాంతాల్లో రైతులకు కిలోకు రూ.30 నుంచి రూ.50 మాత్రమే లభిస్తోంది. కాయ పరిమాణం చిన్నగా ఉంటోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఉత్తర భారతదేశంలో వర్షాలు కురిస్తే.. ధరపై ప్రభావం పడుతుందని, తగ్గే అవకాశాలు ఉంటాయని వివరిస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో గాలివాన బీభత్సం.. అన్నదాతకు తీరని నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.