ETV Bharat / city

ఆర్టీసీ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి: కోదండరాం

author img

By

Published : Oct 26, 2019, 5:53 AM IST

Updated : Oct 26, 2019, 7:11 AM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు బహిరంగ సభ నిర్వహించాయి. అన్ని పార్టీల నాయకులు హాజరై కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపారు. ఆర్టీసీ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి: కోదండరాం

ఆర్టీసీకి ఏర్పడిన నష్టం ప్రభుత్వమే భరించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సమయానికి రాకపోవడం వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయని విమర్శించారు. ఆర్టీసీ ఆస్తులు కేసీఆర్‌ అమ్ముకున్నారని, దీనిని గవర్నర్‌కు వివరించినట్లు కాంగ్రెస్ నేత వీహెచ్‌ తెలిపారు. కార్మికులది న్యాయమైన పోరాటం కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తారని విప్లవ గాయకురాలు విమలక్క అన్నారు.

ఆర్టీసీ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి: కోదండరాం

ఇవీచూడండి: 1600 ఆస్పత్రులకు అగ్నిమాపక అనుమతులపై నోటీసులు

ఆర్టీసీకి ఏర్పడిన నష్టం ప్రభుత్వమే భరించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సమయానికి రాకపోవడం వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయని విమర్శించారు. ఆర్టీసీ ఆస్తులు కేసీఆర్‌ అమ్ముకున్నారని, దీనిని గవర్నర్‌కు వివరించినట్లు కాంగ్రెస్ నేత వీహెచ్‌ తెలిపారు. కార్మికులది న్యాయమైన పోరాటం కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తారని విప్లవ గాయకురాలు విమలక్క అన్నారు.

ఆర్టీసీ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి: కోదండరాం

ఇవీచూడండి: 1600 ఆస్పత్రులకు అగ్నిమాపక అనుమతులపై నోటీసులు

TG_HYD_11_26_OU_SABHA_ON_RTC_AB_3182301_TS10022 ( )హైదరాబాద్ లో ఆర్టీసీ కి ఏర్పడిన నష్టాన్ని ప్రభుత్వం భరించాలని తెలంగాణా జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఓయూ విద్యార్థుల నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన ఆయన..ఆర్టీసీకి ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు సమయానికి రాకపోవడం వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. ఒక్క ఆర్టీసీ బస్సు కూడా సరైన స్థతిలో లేదని అయన వ్యాఖ్యానించారు. ఆర్.టి.సి.ఆస్తులు అన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్ముకున్నారని కాంగ్రెస్ సీనయర్ నేత వీహెచ్ ఎద్దేవా చేశారు.అందుకు ఆర్టీసీన కేసీఆర్ పట్టించుకోవడం లేదని దీనపై ఇప్పటికే గవర్నర్ ను వివరించానని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల పోరాటం న్యాయమైనదని...వారిన పట్టించుకోకుండా కేసీ ఆర్ తప్పులు మీద తప్పులు చేస్తున్నారని విప్లవ గాయకురాలు విమలక్క అన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటం న్యాయమైనదని..పోరాడితే ఆర్టీసీ కార్మికులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బైట్ : కోదండరాం, తెజస అద్యక్షుడు బైట్ : వి.హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత బైట్ : విమలక్క, గాయకురాలు
Last Updated : Oct 26, 2019, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.