రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఈ నెల 10న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ప్రగతిభవన్లో జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం రాత్రి సమాచారం అందించారు. సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బస్సులను నడపాలని, ఇతర ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాల కోసం చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా సీఎం కలెక్టర్ల సమావేశం నిర్వహించి, దిశానిర్దేశం చేయనున్నారు.
ఇవీ చూడండి: నోటిసు లిస్తారా.. తొలగిస్తారా..? తేల్చుకోండి..!