ETV Bharat / city

సంక్రాంతి తర్వాత ఇంటర్‌ తరగతులు ప్రారంభం - minister sabitha indra reddy

తొమ్మిది నెలలుగా మూతపడిన కళాశాలలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి పండుగ అనంతరం ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభించే అవకాశం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

intermediate-colleges-may-open-after-pongal-in-telangana
సంక్రాంతి తర్వాత ఇంటర్‌ తరగతులు ప్రారంభం
author img

By

Published : Jan 3, 2021, 7:22 AM IST

సంక్రాంతి పండుగ అనంతరం ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభించే అవకాశం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(టీపీజేఎంఏ) డైరీని మంత్రి శనివారం ఆవిష్కరించారు. ఈ విద్యా సంవత్సరం ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా కొనసాగాలని అందరం ఆశిద్దామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్‌, ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బడులు ప్రారంభించండి: టీపీఏ

సంక్రాంతి పండగ అనంతరం పాఠశాలలు, కళాశాలలను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం(టీపీఏ) తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. ఈ మేరకు శనివారం టీపీఏ ప్రతినిధుల బృందం మంత్రిని కలిసి విన్నవించింది.

సంక్రాంతి పండుగ అనంతరం ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభించే అవకాశం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(టీపీజేఎంఏ) డైరీని మంత్రి శనివారం ఆవిష్కరించారు. ఈ విద్యా సంవత్సరం ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా కొనసాగాలని అందరం ఆశిద్దామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్‌, ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బడులు ప్రారంభించండి: టీపీఏ

సంక్రాంతి పండగ అనంతరం పాఠశాలలు, కళాశాలలను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం(టీపీఏ) తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. ఈ మేరకు శనివారం టీపీఏ ప్రతినిధుల బృందం మంత్రిని కలిసి విన్నవించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.