ETV Bharat / city

మృతదేహాలను 9 వరకు భద్రపరచండి: హైకోర్టు ఉత్తర్వులు - ఎన్ కౌంటర్​పై  హైకోర్టు  జోక్యం

దిశ హత్య కేసు ఎన్ కౌంటర్​లో మరణించిన నిందితుల మృతదేహాలను ఈనెల 9 వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. పోస్టుమార్టం ప్రక్రియను చిత్రీకరించిన వీడియోలను సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. బూటకపు ఎన్ కౌంటర్​లో కాల్చిచంపినట్లు తెలుస్తోందని.. హైకోర్టు జోక్యం చేసుకోవాలంటూ పలువురు మహిళా హక్కుల, ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి లేఖ రాశారు.

హైకోర్టు ఉత్తర్వులు
మృతదేహాలను 9 వరకు భద్రపరచండి
author img

By

Published : Dec 7, 2019, 5:34 AM IST

Updated : Dec 7, 2019, 7:56 AM IST

మృతదేహాలను 9 వరకు భద్రపరచండి: హైకోర్టు ఉత్తర్వులు
దిశ హత్య కేసు నిందితుల ఎన్​కౌంటర్​పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. మృతదేహాలను ఈనెల 9 వరకు భద్రపరచాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ కౌంటర్​పై హైకోర్టు జోక్యం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి సాయంత్రం 6 గంటలకు పలువురు మహిళా హక్కుల, ప్రజా సంఘాల ప్రతినిధులు లేఖ రాశారు.

స్వతంత్ర కమిటీ వేయాలి..

దిశ హత్యతో ప్రజల్లో వెల్లువెత్తిన భావోద్వేగాలను అవకాశంగా తీసుకొని.. పోలీసులు నలుగురిని కాల్చి చంపినట్లు తెలుస్తోందని లేఖలో పేర్కొన్నారు. కాబట్టి హైకోర్టు జోక్యం చేసుకొని.. మృతదేహాలను భద్రపరిచేలా డీజీపీని ఆదేశించాలని కోరారు. దిల్లీ లేదా తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని ఫోరెన్సిక్ నిపుణులతో శవపరీక్ష నిర్వహించాలని అభ్యర్థించారు. ఎఫ్ఐఆర్, పోలీసుల ఫోన్ కాల్స్, వాహనాల కదలికలు, వైర్​లెస్ రికార్డులు, జనరల్ డైరీ వివరాలను పరిశీలించేందుకు కోర్టు పర్యవేక్షణలో ఓ స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని లేఖలో విన్నవించారు. ఎన్ కౌంటర్​లో పాల్గొన్న పోలీసులపై హత్య కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలన్నారు.

మృతదేహాలు భద్రపరచండి

లేఖపై స్పందించిన హైకోర్టు... ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్​తో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. రాత్రి 8 గంటలకు న్యాయమూర్తి నివాసంలో జరిగిన విచారణకు హైకోర్టు ఆదేశాల మేరకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరయ్యారు. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శవపరీక్ష ప్రక్రియనంతా వీడియో చిత్రీకరించినట్లు వివరించారు. ఆ వీడియోలను సీడీ లేదా పెన్​డ్రైవ్​లలో మహబూబ్ నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జికి సమర్పించాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.

పోలీసులు ఇచ్చిన వీడియోలను శనివారం సాయంత్రానికల్లా తమకు చేర్చాలని మహబూబ్ నగర్ జిల్లా న్యాయమూర్తికి హైకోర్టు తెలిపింది. మృతదేహాలను ఈ నెల​ 9న.. రాత్రి 8 గంటల వరకు భద్రపరచాలని ధర్మాసనం ఆదేశించింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 9న ఉదయం పదిన్నర గంటలకు చేపట్టనున్నట్లు పేర్కొంది.

ఇవీ చూడండి: ఎన్​కౌంటర్​పై పోలీసులకు ఎన్​హెచ్​ఆర్​సీ నోటీసులు

మృతదేహాలను 9 వరకు భద్రపరచండి: హైకోర్టు ఉత్తర్వులు
దిశ హత్య కేసు నిందితుల ఎన్​కౌంటర్​పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. మృతదేహాలను ఈనెల 9 వరకు భద్రపరచాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ కౌంటర్​పై హైకోర్టు జోక్యం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి సాయంత్రం 6 గంటలకు పలువురు మహిళా హక్కుల, ప్రజా సంఘాల ప్రతినిధులు లేఖ రాశారు.

స్వతంత్ర కమిటీ వేయాలి..

దిశ హత్యతో ప్రజల్లో వెల్లువెత్తిన భావోద్వేగాలను అవకాశంగా తీసుకొని.. పోలీసులు నలుగురిని కాల్చి చంపినట్లు తెలుస్తోందని లేఖలో పేర్కొన్నారు. కాబట్టి హైకోర్టు జోక్యం చేసుకొని.. మృతదేహాలను భద్రపరిచేలా డీజీపీని ఆదేశించాలని కోరారు. దిల్లీ లేదా తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని ఫోరెన్సిక్ నిపుణులతో శవపరీక్ష నిర్వహించాలని అభ్యర్థించారు. ఎఫ్ఐఆర్, పోలీసుల ఫోన్ కాల్స్, వాహనాల కదలికలు, వైర్​లెస్ రికార్డులు, జనరల్ డైరీ వివరాలను పరిశీలించేందుకు కోర్టు పర్యవేక్షణలో ఓ స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని లేఖలో విన్నవించారు. ఎన్ కౌంటర్​లో పాల్గొన్న పోలీసులపై హత్య కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలన్నారు.

మృతదేహాలు భద్రపరచండి

లేఖపై స్పందించిన హైకోర్టు... ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్​తో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. రాత్రి 8 గంటలకు న్యాయమూర్తి నివాసంలో జరిగిన విచారణకు హైకోర్టు ఆదేశాల మేరకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరయ్యారు. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శవపరీక్ష ప్రక్రియనంతా వీడియో చిత్రీకరించినట్లు వివరించారు. ఆ వీడియోలను సీడీ లేదా పెన్​డ్రైవ్​లలో మహబూబ్ నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జికి సమర్పించాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.

పోలీసులు ఇచ్చిన వీడియోలను శనివారం సాయంత్రానికల్లా తమకు చేర్చాలని మహబూబ్ నగర్ జిల్లా న్యాయమూర్తికి హైకోర్టు తెలిపింది. మృతదేహాలను ఈ నెల​ 9న.. రాత్రి 8 గంటల వరకు భద్రపరచాలని ధర్మాసనం ఆదేశించింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 9న ఉదయం పదిన్నర గంటలకు చేపట్టనున్నట్లు పేర్కొంది.

ఇవీ చూడండి: ఎన్​కౌంటర్​పై పోలీసులకు ఎన్​హెచ్​ఆర్​సీ నోటీసులు

‍TG_HYD_81_06_HC_ON_ENCOUNTER_PKG_3064645 REPORTER: Nageshwara Chary ( ) దిశ హత్య కేసు ఎన్ కౌంటర్ లో మరణించిన నిందితుల మృతదేహాలను ఈనెల 9 వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. పోస్టుమార్టం ప్రక్రియను చిత్రీకరించిన వీడియోలను సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. బూటకపు ఎన్ కౌంటరులో కాల్చిచంపినట్లు తెలుస్తోందని.. హైకోర్టు జోక్యం చేసుకోవాలంటూ పలువురు మహిళ హక్కుల, ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి లేఖ రాశారు. లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం... రాత్రి అత్యవసరంగా విచారణ చేపట్టింది. look వాయిస్ ఓవర్: దిశ హత్య కేసు నిందితులపై హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది. మృతదేహాలను ఈనెల 9వ తేదీ వరకు భద్రపరచాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ కౌంటర్ పై హైకోర్టు జోక్యం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి సాయంత్రం 6 గంటలకు సజయ, సంఘమిత్ర, పద్మజషా, దేవి, ఝాన్సీ, విమల, సంధ్య, విజయ ఆశాలత తదితర మహిళ, ప్రజా సంఘాల ప్రతినిధులు లేఖ రాశారు. హైకోర్టును దిశ హత్యతో ప్రజల్లో వెల్లువెత్తిన భావోద్వేగాలను అవకాశంగా తీసుకొని.. పోలీసులు నలుగురు యువకులను కాల్చి చంపినట్లు తెలుస్తోందని లేఖలో పేర్కొన్నారు. కాబట్టి హైకోర్టు జోక్యం చేసుకొని.. మృతదేహాలను భద్రపరిచేలా డీజీపీని ఆదేశించాలని కోరారు. దిల్లీ లేదా తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని ఫోరెన్సిక్ నిపుణులతో శవపరీక్ష నిర్వహించాలని అభ్యర్థించారు. ఎఫ్ఐఆర్, పోలీసుల ఫోన్ కాల్స్, వాహనాల కదలికలుస వైర్ లెస్ రికార్డులు, జనరల్ డైరీ వివరాలను పరిశీలించేందుకు కోర్టు పర్యవేక్షణలో ఓ స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై హత్య కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలన్నారు. స్పందించిన హైకోర్టు లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్ తో కూడిన ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది. రాత్రి 8 గంటలకు న్యాయమూర్తి నివాసంలో జరిగిన విచారణకు హైకోర్టు ఆదేశాల మేరకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరయ్యారు. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శవపరీక్ష ప్రక్రియనంతా వీడియో చిత్రీకరించినట్లు వివరించారు. స్పందించిన ధర్మాసనం వీడియోలను సీడీ లేదా పెన్ డ్రైవ్ లో మహబూబ్ నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జికి సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు ఇచ్చిన వీడియోలను రేపు సాయంత్రానికల్లా తమకు చేర్చాలని మహబూబ్ నగర్ జిల్లా న్యాయమూర్తికి హైకోర్టు తెలిపింది. మృతదేహాలను ఈనెల 9 వ తేదీ రాత్రి 8 గంటల వరకు భద్రపరచాలని ధర్మాసనం ఆదేశించింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈనెల 9 వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఎండ్
Last Updated : Dec 7, 2019, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.