ETV Bharat / city

హుస్సేన్​సాగర్​లో కొనసాగుతున్న దుర్గామాత విగ్రహాల నిమజ్జనం

author img

By

Published : Oct 27, 2020, 12:23 PM IST

హైదరాబాద్​ హుస్సేన్​సాగర్​లో దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం మంగళవారం ఉదయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్​టీఆర్​ మార్గ్​లో అధికారులు ఏర్పాటు చేసిన 8 క్రేన్ల సహాయంతో నిమజ్జనం త్వరగా పూర్తి చేసేలా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షించారు.

goddess durga nimajjanam continues at hussain sagar
హుస్సేన్​సాగర్​లో కొనసాగుతున్న దుర్గామాత విగ్రహాల నిమజ్జనం

దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాం సోమవారం సాయంత్రం నుంచి నిమజ్జనం కొనసాగుతున్నప్పటికీ.. మంగళవారం ఉదయానికి ట్యాంక్​బండ్​పై దుర్గామాత విగ్రహాలు నిలిచిపోయాయి. ఎన్​టీఆర్​ మార్గ్​లో అధికారులు ఏర్పాటు చేసిన 8 క్రేన్ల సహాయంతో నిమజ్జనం త్వరగా పూర్తి చేసేలా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షించారు.

ట్యాంక్​బండ్​ పరిసర ప్రాంతాల్లోకి పోలీసులు వాహనాలను అనుమతించకపోవడం వల్ల.. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రాగా.. హుస్సేన్​సాగర్​ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి.

దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాం సోమవారం సాయంత్రం నుంచి నిమజ్జనం కొనసాగుతున్నప్పటికీ.. మంగళవారం ఉదయానికి ట్యాంక్​బండ్​పై దుర్గామాత విగ్రహాలు నిలిచిపోయాయి. ఎన్​టీఆర్​ మార్గ్​లో అధికారులు ఏర్పాటు చేసిన 8 క్రేన్ల సహాయంతో నిమజ్జనం త్వరగా పూర్తి చేసేలా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షించారు.

ట్యాంక్​బండ్​ పరిసర ప్రాంతాల్లోకి పోలీసులు వాహనాలను అనుమతించకపోవడం వల్ల.. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రాగా.. హుస్సేన్​సాగర్​ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి.

ఇదీ చదవండిః ఓరుగల్లులో గంగమ్మ ఒడికి చేరిన దుర్గా దేవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.