ఏపీ కడప జిల్లా చిట్వేలు మండలంలోని రాపూరు- చిట్వేల్ రహదారిలో వెలుగొండ అడవి అగ్నికి ఆహుతైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చిట్వేల్-రాపూరు రహదారిలో వెలిగొండల్లో భారీగా కార్చిచ్చు ప్రబలి అడవి దహించుకుపోతోంది. ఎంతో విలువైన ఎర్రచందనంతో పాటు వృక్షసంపద, జంతుజాలం అగ్నికి ఆహుతయ్యాయి.
రహదారి గుండా పోయే గుర్తుతెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. గత ఐదారు నెలల నుంచి భారీ వర్షాలు పడగా.. అడవి పచ్చని చెట్లతో కళకళ లాడుతున్న సమయంలో ఇలా జరగడం పై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'అత్యవసరమైతేనే బయటకి రండి.. కరోనా వస్తే బెడ్లు దొరకవు'