ETV Bharat / city

'కరోనా వల్లే రుణమాఫీ ఆలస్యమైంది'

author img

By

Published : Mar 18, 2021, 1:08 PM IST

Updated : Mar 18, 2021, 2:40 PM IST

రాష్ట్ర వార్షికి బడ్జెట్​ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు ప్రవేశపెట్టారు. రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయించారు. రైతు బీమా కోసం రూ. 1200 కోట్లు కేటాయించారు.

runamafi
'కరోనా వల్లే రుణమాఫీ ఆలస్యమైంది'

గత ఎన్నికల్లో రాష్ట్రంలోని రైతులకు, లక్షలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చినట్లు హరీశ్​ రావు గుర్తు చేశారు. రూ.25 వేల ఉన్న రుణాలను ఇప్పటికే మాఫీ చేసినట్లు తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా రైతులకున్నా రుణాలను రద్దు చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. త్వరలోనే ఈ రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది.

రాష్ట్ర వార్షిక బడ్జెట్​లో రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయించారు. రైతు బీమా కోసం రూ. 1200 కోట్లు కేటాయించారు. ఏ కారణంతోనైనా రైతులు మరణిస్తే బాధిత కుటుంబం అనాథ కావొద్దని ప్రభుత్వం భావించిందని హరీశ్​రావు తెలిపారు. రైతు కుటుంబాల సంక్షేమం కోసం రైతు బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గుంట భూమి ఉన్న రైతు మరణించినా ఆ అన్నదాత కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము చెల్లిస్తున్నట్లు తెలిపారు.

రైతు బీమా పథకం ద్వారా 2020-21 సంవత్సరంలో 32.73 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రీమియం మొత్తం రూ.1141.4 కోట్లను ప్రభుత్వం ఎల్​ఐసీకి చెల్లించిందని పేర్కొన్నారు. గత మూడేళ్లలో 46,564 రైతు కుటుంబాలకు రూ.2,328 కోట్లు అందించినట్లు తెలిపారు.

గంట భూమి కలిగి ఉన్నా.. రైతు బీమా వర్తిస్తుండడం వల్ల ప్రతి ఒక్కరూ తమ పేరుతో ఎంతో కొంత భూమి ఉండాలని కోరుకుంటున్నారని హరీశ్​ అన్నారు. ఉన్న భూమిని కూడా కుటుంబంలోని వారసులకు పంచి ఇస్తున్నారన్నారు. దీని వల్ల పాలసీదారుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు బీమా పథకానికి రూ.1,200 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

'కరోనా వల్లే రుణమాఫీ ఆలస్యమైంది'

ఇవీచూడండి: 2 లక్షల కోట్లను దాటిన తెలంగాణ వార్షిక బడ్జెట్‌

గత ఎన్నికల్లో రాష్ట్రంలోని రైతులకు, లక్షలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చినట్లు హరీశ్​ రావు గుర్తు చేశారు. రూ.25 వేల ఉన్న రుణాలను ఇప్పటికే మాఫీ చేసినట్లు తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా రైతులకున్నా రుణాలను రద్దు చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. త్వరలోనే ఈ రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది.

రాష్ట్ర వార్షిక బడ్జెట్​లో రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయించారు. రైతు బీమా కోసం రూ. 1200 కోట్లు కేటాయించారు. ఏ కారణంతోనైనా రైతులు మరణిస్తే బాధిత కుటుంబం అనాథ కావొద్దని ప్రభుత్వం భావించిందని హరీశ్​రావు తెలిపారు. రైతు కుటుంబాల సంక్షేమం కోసం రైతు బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గుంట భూమి ఉన్న రైతు మరణించినా ఆ అన్నదాత కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము చెల్లిస్తున్నట్లు తెలిపారు.

రైతు బీమా పథకం ద్వారా 2020-21 సంవత్సరంలో 32.73 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రీమియం మొత్తం రూ.1141.4 కోట్లను ప్రభుత్వం ఎల్​ఐసీకి చెల్లించిందని పేర్కొన్నారు. గత మూడేళ్లలో 46,564 రైతు కుటుంబాలకు రూ.2,328 కోట్లు అందించినట్లు తెలిపారు.

గంట భూమి కలిగి ఉన్నా.. రైతు బీమా వర్తిస్తుండడం వల్ల ప్రతి ఒక్కరూ తమ పేరుతో ఎంతో కొంత భూమి ఉండాలని కోరుకుంటున్నారని హరీశ్​ అన్నారు. ఉన్న భూమిని కూడా కుటుంబంలోని వారసులకు పంచి ఇస్తున్నారన్నారు. దీని వల్ల పాలసీదారుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు బీమా పథకానికి రూ.1,200 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

'కరోనా వల్లే రుణమాఫీ ఆలస్యమైంది'

ఇవీచూడండి: 2 లక్షల కోట్లను దాటిన తెలంగాణ వార్షిక బడ్జెట్‌

Last Updated : Mar 18, 2021, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.