ETV Bharat / city

కిడ్నాప్ కథ సుఖాంతం... - kachiguda kidnapping story

సోమవారం చాదర్​ఘాట్​ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద నిద్రిస్తున్న తల్లి పక్కలో నుంచి బిడ్డను ఎత్తుకెళ్లిన కేసును కాచిగూడ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.

కిడ్నాప్ కథ సుఖాంతం
author img

By

Published : Nov 12, 2019, 11:22 PM IST

కాచిగూడ పోలీస్​స్టేషన్​ పరిధిలోని చాదర్​ఘాట్​ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కిడ్నాప్​కు గురైన పాప కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సోమవారం మధ్యాహ్నం ఎల్లమ్మ గుడి వద్ద నిద్రిస్తున్న తల్లి పక్కలో నుంచి సంవత్సరంన్నర వయసు గల మహేశ్వరి అపహరణకు గురైంది. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల గాంధీనగర్​కు చెందిన మిరియాల కృష్ణవేణి భర్త నర్సింహులుతో విభేదాల కారణంగా నగరంలోని లంగర్​హౌస్​ పరిధిలోని బాబునగర్​లో నివాసం ఉంటు భిక్షాటన చేస్తూ.. జీవనం కొనసాగిస్తోంది.

సోమవారం మధ్యాహ్నాం 3 గంటల సమయంలో చాదర్​ఘాట్ కూడలి వద్ద గల రేణుక ఎల్లమ్మ ఆలయం ముందు అలిసిపోయి నిద్రిస్తున్న సమయంలో శంకర్​నగర్​కు చెందిన అవినాశ్​, సంధ్య దంపతులు కృష్ణవేణి పక్కలో నుంచి మహేశ్వరి ఎత్తుకెళ్లారు. గంట తర్వాత నిద్రలేచిన కృష్ణవేణి పక్కలో కూతురు లేకపోవడం గమనించి చుట్టుపక్కల వెతికి కాచిగూడ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా 24 గంటల్లో కేసును ఛేదించి బిడ్డను తల్లిచెంతకు చేర్చారు. కేసు ఛేదించిన కాచిగూడ పోలీసులను ఈస్ట్​జోన్ ఏసీపీ సుధాకర్ అభినందించి రివార్డు ప్రకటించారు.

కాచిగూడ పోలీస్​స్టేషన్​ పరిధిలోని చాదర్​ఘాట్​ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కిడ్నాప్​కు గురైన పాప కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సోమవారం మధ్యాహ్నం ఎల్లమ్మ గుడి వద్ద నిద్రిస్తున్న తల్లి పక్కలో నుంచి సంవత్సరంన్నర వయసు గల మహేశ్వరి అపహరణకు గురైంది. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల గాంధీనగర్​కు చెందిన మిరియాల కృష్ణవేణి భర్త నర్సింహులుతో విభేదాల కారణంగా నగరంలోని లంగర్​హౌస్​ పరిధిలోని బాబునగర్​లో నివాసం ఉంటు భిక్షాటన చేస్తూ.. జీవనం కొనసాగిస్తోంది.

సోమవారం మధ్యాహ్నాం 3 గంటల సమయంలో చాదర్​ఘాట్ కూడలి వద్ద గల రేణుక ఎల్లమ్మ ఆలయం ముందు అలిసిపోయి నిద్రిస్తున్న సమయంలో శంకర్​నగర్​కు చెందిన అవినాశ్​, సంధ్య దంపతులు కృష్ణవేణి పక్కలో నుంచి మహేశ్వరి ఎత్తుకెళ్లారు. గంట తర్వాత నిద్రలేచిన కృష్ణవేణి పక్కలో కూతురు లేకపోవడం గమనించి చుట్టుపక్కల వెతికి కాచిగూడ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా 24 గంటల్లో కేసును ఛేదించి బిడ్డను తల్లిచెంతకు చేర్చారు. కేసు ఛేదించిన కాచిగూడ పోలీసులను ఈస్ట్​జోన్ ఏసీపీ సుధాకర్ అభినందించి రివార్డు ప్రకటించారు.

కిడ్నాప్ కథ సుఖాంతం

ఇవీచూడండి: విహారయాత్రకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

Intro:కిడ్నాప్ కథ సుఖాంతం...

నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో లో చదర్గాట్ రేణుక ఎల్లమ్మ టెంపుల్ ముందు నిద్రిస్తున్న తల్లి పక్కలో నుండి సంవత్సరన్నర గల పాపని తిరిగి 24 గంటలు గడవకముందే కి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చిన కాచిగూడ పోలీసులు..

నిన్న కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల చాదర్ఘాట్ రేణుక ఎల్లమ్మ టెంపుల్ ముందు నిద్రిస్తున్న తల్లి పక్కలో నుండి సంవత్సరన్నర వయసు గల మహేశ్వరి అనే అమ్మాయి కిడ్నాప్ కు గురవడం జరిగింది... మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల గాంధీనగర్కు చెందిన మిరియాల కృష్ణవేణి వయస్సు సుమారు 26 భర్త నర్సింలు తో విభేదాల కారణంగా భర్తతో దూరంగా ఉంటూ హైదరాబాద్లోని లంగర్ హౌస్ బాబు నగర్ లో ని వాసం ఉంటూ భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తుంది... అయితే అలా భిక్షాటన చేస్తూ నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చాదర్ఘాట్ కూడలి వద్ద గల రేణుక ఎల్లమ్మ టెంపుల్ ముందు అలిసిపోయి కూతురు సంవత్సరన్నర గల అమ్మాయి మహేశ్వరి పెట్టుకొని నిద్రిస్తున్న సమయంలో హైదరాబాద్ చాదర్ఘాట్ శంకర్ నగర్ కు చెందిన కే సంధ్య వయసు 32 మరియు భర్త అవినాష్ దంపతులు కృష్ణవేణి పక్కలో నుండి మహేశ్వరి ఎత్తుకెళ్లడo జరిగినది... ఒక గంట తర్వాత నిద్రలేచిన కృష్ణవేణి పక్కలో కూతురు లేకపోవడంతో చుట్టుపక్కల వెతికి కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే పోలీసులు సీసీ కెమెరాల ద్వారా పాపని ఎత్తుకెళ్లిన వాళ్ళని 24 గంటల్లోనే వెతికి పట్టుకొని పాపని తల్లిచెంతకు చేర్చడం జరిగింది... 24 గంటల్లోనే కేసును ఛేదించిన కాచిగూడ పోలీసులను ఈస్ట్ జోన్ ఎసిపి సుధాకర్ అభినందించి రివార్డులు ప్రకటించడం జరిగింది...


Body:విజేందర్ అంబరుపేట


Conclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.