కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చాదర్ఘాట్ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కిడ్నాప్కు గురైన పాప కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సోమవారం మధ్యాహ్నం ఎల్లమ్మ గుడి వద్ద నిద్రిస్తున్న తల్లి పక్కలో నుంచి సంవత్సరంన్నర వయసు గల మహేశ్వరి అపహరణకు గురైంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల గాంధీనగర్కు చెందిన మిరియాల కృష్ణవేణి భర్త నర్సింహులుతో విభేదాల కారణంగా నగరంలోని లంగర్హౌస్ పరిధిలోని బాబునగర్లో నివాసం ఉంటు భిక్షాటన చేస్తూ.. జీవనం కొనసాగిస్తోంది.
సోమవారం మధ్యాహ్నాం 3 గంటల సమయంలో చాదర్ఘాట్ కూడలి వద్ద గల రేణుక ఎల్లమ్మ ఆలయం ముందు అలిసిపోయి నిద్రిస్తున్న సమయంలో శంకర్నగర్కు చెందిన అవినాశ్, సంధ్య దంపతులు కృష్ణవేణి పక్కలో నుంచి మహేశ్వరి ఎత్తుకెళ్లారు. గంట తర్వాత నిద్రలేచిన కృష్ణవేణి పక్కలో కూతురు లేకపోవడం గమనించి చుట్టుపక్కల వెతికి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా 24 గంటల్లో కేసును ఛేదించి బిడ్డను తల్లిచెంతకు చేర్చారు. కేసు ఛేదించిన కాచిగూడ పోలీసులను ఈస్ట్జోన్ ఏసీపీ సుధాకర్ అభినందించి రివార్డు ప్రకటించారు.
ఇవీచూడండి: విహారయాత్రకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి