ETV Bharat / city

CPM Leaders Comments: 'రాందేవ్​ బాబాకు సమానత్వం గురించి మాట్లాడే హక్కే లేదు..'

author img

By

Published : Feb 12, 2022, 5:34 PM IST

CPM Leaders Comments: ముచ్చింతల్​లోని సమతామూర్తిని వామపక్షనేతలు సందర్శించాలని రాందేవ్​ బాబా చేసిన వ్యాఖ్యలపై సీపీఎం నేతలు స్పందించారు. రాందేవ్​బాబా మొదట.. దళిత, గిరిజన వాడలను సందర్శించిన తర్వాత సమానత్వం గురించి మాట్లాడాలని సీపీఎం పోలిట్​ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హితవు పలికారు.

CPM Leaders Comments on ramdev baba and CM KCR
CPM Leaders Comments on ramdev baba and CM KCR

CPM Leaders Comments: వామపక్ష నేతలు సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించాలని రాందేవ్‌ బాబా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. సమానత్వం గురించి మాట్లాడే హక్కు రాందేవ్‌ బాబాకు లేదన్నారు. సమానత్వం ఎక్కడ ఉందో రాందేవ్‌ బాబా చెప్పాలని డిమాండ్‌ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి పార్టీ రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ఆవిష్కరించారు. రాందేవ్​ బాబా మొదట.. దళిత, గిరిజన వాడలను సందర్శించిన తర్వాత సమానత్వం గురించి మాట్లాడాలని రాఘవులు హితవు పలికారు.

"కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఫెడరల్‌ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయమని కరాఖండిగా చెప్పడం సంతోషకరం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాకు శృంగభంగం కలగటం ఖాయం. కర్ణాటకలో హిజాబ్‌ పేరుతో భాజపా మత వివాదాన్ని సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే భాజపా హిజాబ్‌ సమస్యను తీసుకొచ్చింది." - బీవీ రాఘవులు, సీపీఎం పోలిట్​ బ్యూరో సభ్యుడు

కేసీఆర్​.. కేకలు వేయటమే తప్ప..

విభజన హామీలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెతక వైఖరి అవలంభించారని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. కేంద్రంపై కేసీఆర్‌ కేకలు వేయడం తప్పితే భాజపా వ్యతిరేక శక్తులను కలుపుకుపోవడం లేదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మాట తప్పారన్నారు. రాష్ట్రంలో భాజపా మతం పేరుతో ఆందోళనలు సృష్టిస్తోందని విమర్శించారు.

రాందేవ్​ బాబాకు సమానత్వం గురించి మాట్లాడే హక్కే లేదు..

ఇదీ చూడండి:

CPM Leaders Comments: వామపక్ష నేతలు సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించాలని రాందేవ్‌ బాబా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. సమానత్వం గురించి మాట్లాడే హక్కు రాందేవ్‌ బాబాకు లేదన్నారు. సమానత్వం ఎక్కడ ఉందో రాందేవ్‌ బాబా చెప్పాలని డిమాండ్‌ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి పార్టీ రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ఆవిష్కరించారు. రాందేవ్​ బాబా మొదట.. దళిత, గిరిజన వాడలను సందర్శించిన తర్వాత సమానత్వం గురించి మాట్లాడాలని రాఘవులు హితవు పలికారు.

"కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఫెడరల్‌ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయమని కరాఖండిగా చెప్పడం సంతోషకరం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాకు శృంగభంగం కలగటం ఖాయం. కర్ణాటకలో హిజాబ్‌ పేరుతో భాజపా మత వివాదాన్ని సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే భాజపా హిజాబ్‌ సమస్యను తీసుకొచ్చింది." - బీవీ రాఘవులు, సీపీఎం పోలిట్​ బ్యూరో సభ్యుడు

కేసీఆర్​.. కేకలు వేయటమే తప్ప..

విభజన హామీలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెతక వైఖరి అవలంభించారని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. కేంద్రంపై కేసీఆర్‌ కేకలు వేయడం తప్పితే భాజపా వ్యతిరేక శక్తులను కలుపుకుపోవడం లేదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మాట తప్పారన్నారు. రాష్ట్రంలో భాజపా మతం పేరుతో ఆందోళనలు సృష్టిస్తోందని విమర్శించారు.

రాందేవ్​ బాబాకు సమానత్వం గురించి మాట్లాడే హక్కే లేదు..

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.