హైదరాబాద్లో రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఖైరతాబాద్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 30 కేసులు నమోదయ్యాయి. ఇళ్లలోనే చికిత్స తీసుకుంటున్న బాధితుల్లో కొందరు బయట తిరుగుతున్నారని స్థానికులు అంటున్నారు.
రెండు నెలలు క్రితం కరోనా వచ్చిన వారు ఉండే విధినే మూసివేశారని... ఇప్పుడు అలాంటి నిబంధనలు లేకపోవడం వల్ల కరోనా సోకినవారు బయటకు వస్తున్నారని... దీంతో భయాందోళనకు గురవుతున్నామని చుట్టూ పక్కల ఇళ్లవాళ్లు, కాలనీవాసులు అంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఇలాంటి వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని... కొవిడ్ టెస్టుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఘట్కేసర్లో హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య