ETV Bharat / city

కరోనా విజృంభణ: 503కు చేరిన కేసులు

author img

By

Published : Apr 12, 2020, 5:08 AM IST

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 503కు చేరింది. ఇప్పటి వరకు 96 మంది కోలుకున్నారు. 14 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో వ్యాధి సోకి పర్యవేక్షణలో ఉన్న వారంతా ఇంటికి వెళ్లారని సర్కారు తెలిపింది. రాష్ట్రంలో ఈనెల 24కు కరోనా సమస్య దాదాపుగా పరిష్కారమవుతుందని పేర్కొంది. రాష్ట్రాన్ని 243 కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి వైరస్‌ ప్రబలకుండా కఠిన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు.

corona toll crossed five hundred in telangana
కరోనా విజృంభణ: 503కు చేరిన కేసులు

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 503కు చేరింది. ఇప్పటి వరకు 96 మంది కొలుకొని ఇళ్లకు వెళ్లారు. వైరస్‌తో శనివారం మరో ఇద్దరు చనిపోవడం ఫలితంగా మృతుల సంఖ్య 14కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 393 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ప్రస్తుతం ఎవరూ ఆస్పత్రుల్లో, ప్రభుత్వ పర్యవేక్షణలో లేరని ముఖ్యమంత్రి ప్రకటించారు. దిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారందరికీ పరీక్షలు పూర్తయ్యాయని ప్రస్తుతం 1654 మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు. కొత్త కేసుల సంఖ్య తగ్గిందన్నారు.

కంటైన్మెంట్​ జోన్లు..

కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్ని కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి.. అవసరమైన చర్యలు చేపట్టినట్లు కేసీఆర్‌ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 243 ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాలకు నిత్యవసరాలను ఇంటి వద్దకే సరఫరా చేస్తామన్నారు.

కరోనాకు చికిత్స చేసుకునే ప్రతిఒక్కరూ గాంధీ ఆస్పత్రిలోనే ఉండాలని కేసీఆర్​ స్పష్టం చేశారు. కోవిడ్ కోసం ప్రత్యేకంగా కొన్ని ఆస్పత్రులను నోటిఫైడ్ చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ దవాఖానాలు అత్యవసర సేవలను నిరాకరించడం తగదన్నారు. ఆ అంశంపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. మాస్కుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఇళ్లల్లోనూ తయారు చేసుకోవచ్చని సూచించారు.

ఇవీచూడండి: భారత్​లో కరోనా విజృంభణ-మహారాష్ట్రలో తీవ్రత అధికం

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 503కు చేరింది. ఇప్పటి వరకు 96 మంది కొలుకొని ఇళ్లకు వెళ్లారు. వైరస్‌తో శనివారం మరో ఇద్దరు చనిపోవడం ఫలితంగా మృతుల సంఖ్య 14కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 393 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ప్రస్తుతం ఎవరూ ఆస్పత్రుల్లో, ప్రభుత్వ పర్యవేక్షణలో లేరని ముఖ్యమంత్రి ప్రకటించారు. దిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారందరికీ పరీక్షలు పూర్తయ్యాయని ప్రస్తుతం 1654 మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు. కొత్త కేసుల సంఖ్య తగ్గిందన్నారు.

కంటైన్మెంట్​ జోన్లు..

కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్ని కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి.. అవసరమైన చర్యలు చేపట్టినట్లు కేసీఆర్‌ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 243 ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాలకు నిత్యవసరాలను ఇంటి వద్దకే సరఫరా చేస్తామన్నారు.

కరోనాకు చికిత్స చేసుకునే ప్రతిఒక్కరూ గాంధీ ఆస్పత్రిలోనే ఉండాలని కేసీఆర్​ స్పష్టం చేశారు. కోవిడ్ కోసం ప్రత్యేకంగా కొన్ని ఆస్పత్రులను నోటిఫైడ్ చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ దవాఖానాలు అత్యవసర సేవలను నిరాకరించడం తగదన్నారు. ఆ అంశంపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. మాస్కుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఇళ్లల్లోనూ తయారు చేసుకోవచ్చని సూచించారు.

ఇవీచూడండి: భారత్​లో కరోనా విజృంభణ-మహారాష్ట్రలో తీవ్రత అధికం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.