హైదరాబాద్ కాలాపత్తర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రన్మస్త్ పుర ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా అధికారులు గుర్తించారు.
రన్మస్త్ పుర ప్రాంతంలో మూడు రోజుల క్రితం ఓ వృద్ధురాలు కరోనా లక్షణాలతో మరణించింది. అప్రమత్తమైన అధికారులు ఆమె కుటుంబ సభ్యులందరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 11 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా గుర్తించినట్లు కాలాపత్తర్ ఎస్ఐ సుదర్శన్ తెలిపారు.
వైద్య, పురపాలక, పోలీస్ అధికారులు ప్రతినిత్యం ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తారని వెల్లడించారు. వారికి ఎలాంటి అవసరం ఉన్న తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిత్యవసర సరకులను ఇళ్ల వద్దకే వచ్చేలా ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: సూపర్ మార్కెట్కు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!