ETV Bharat / city

Attack on Nara Lokesh: నారా లోకేశ్​పై దాడి.. పీఎస్​లో తెదేపా నాయకుల ఫిర్యాదు - గుంటూరు జిల్లా వార్తలు

Attack on Nara Lokesh: ఏపీలోని గుంటూరు జిల్లా దుగ్గిరాలలో నిన్న(శుక్రవారం) జరిగిన ఘటనపై స్థానిక పోలీస్​ స్టేషన్​లో తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. పార్టీ నేత నారా లోకేశ్​​ మీద దాడి చేసిన వైకాపా నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

Nara Lokesh
పీఎస్​లో తెదేపా నాయకుల ఫిర్యాదు
author img

By

Published : Apr 29, 2022, 10:34 PM IST

Attack on Nara Lokesh: ఏపీలోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ మీద దాడి ఘటనపై ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేశ్​పై దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోలీసులకు అందజేశారు. వైకాపా నేతలు, ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు లోకేశ్​పై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి చేయడం సమంజసం కాదని పార్టీ నేతలు మండిపడ్డారు. మంగళగిరిలో పనిచేసిన ఏ శాసనసభ్యులు ఈ విధంగా వ్యవహరించలేదని విమర్శించారు. ఈ తరహా ఘటనలపై అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

ఎం జరిగిందంటే..: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా నేత లోకేశ్ గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న వైకాపా శ్రేణులు.. తెదేపా శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు.., తెదేపా వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. లోకేశ్​తో పాటు తెదేపా శ్రేణుల పైకి వైకాపా శ్రేణులు రాళ్లు విసిరారు. అడ్డుకున్న పోలీసులు వైకాపా శ్రేణులను నిలువరించారు. దాడిలో ఎమ్మెల్యే ఆర్కే డ్రైవర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వైకాపా నాయకులు విసిరిన ఓ పెద్దరాయి లోకేశ్‌ సమీపంలో పడింది. తృటిలో ఆయన దాన్నుంచి తప్పించుకున్నారు. రాళ్ల దాడిలో హెడ్‌కానిస్టేబుల్‌ మోహన్‌రావు తలకు గాయమైంది. రాయి దూసుకురావడంతో దుగ్గిరాల ఎస్సై శ్రీనివాసరెడ్డి తలపై టోపీ లేచిపోయింది.

ఇదీ చదవండి: యాదగిరిగుట్టలో కుప్పకూలిన రెండతస్తుల భవనం.. నలుగురు మృతి

Attack on Nara Lokesh: ఏపీలోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ మీద దాడి ఘటనపై ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేశ్​పై దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోలీసులకు అందజేశారు. వైకాపా నేతలు, ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు లోకేశ్​పై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి చేయడం సమంజసం కాదని పార్టీ నేతలు మండిపడ్డారు. మంగళగిరిలో పనిచేసిన ఏ శాసనసభ్యులు ఈ విధంగా వ్యవహరించలేదని విమర్శించారు. ఈ తరహా ఘటనలపై అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

ఎం జరిగిందంటే..: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా నేత లోకేశ్ గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న వైకాపా శ్రేణులు.. తెదేపా శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు.., తెదేపా వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. లోకేశ్​తో పాటు తెదేపా శ్రేణుల పైకి వైకాపా శ్రేణులు రాళ్లు విసిరారు. అడ్డుకున్న పోలీసులు వైకాపా శ్రేణులను నిలువరించారు. దాడిలో ఎమ్మెల్యే ఆర్కే డ్రైవర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వైకాపా నాయకులు విసిరిన ఓ పెద్దరాయి లోకేశ్‌ సమీపంలో పడింది. తృటిలో ఆయన దాన్నుంచి తప్పించుకున్నారు. రాళ్ల దాడిలో హెడ్‌కానిస్టేబుల్‌ మోహన్‌రావు తలకు గాయమైంది. రాయి దూసుకురావడంతో దుగ్గిరాల ఎస్సై శ్రీనివాసరెడ్డి తలపై టోపీ లేచిపోయింది.

ఇదీ చదవండి: యాదగిరిగుట్టలో కుప్పకూలిన రెండతస్తుల భవనం.. నలుగురు మృతి

90 కిలోల హెరాయిన్​ పట్టివేత​​​.. విలువ రూ.450 కోట్లకుపైనే!

75ఏళ్ల వయసులో కరాటే.. రెండో ర్యాంక్​ బ్లాక్​ బెల్ట్​ కైవసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.