పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లాల నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలతో సీఎం ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు.
వాణిదేవికి ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫారం అందించి... నేతలను పరిచయం చేశారు. వాణీదేవి అభ్యర్థిత్వంపై అంతటా మంచి స్పందన ఉందన్న కేసీఆర్... నేతలంతా కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ నేతలు సొంత ఎన్నికలా బాధ్యతలు తీసుకొని వాణీదేవిని గెలిపించాలన్నారు. అనంతరం నేతలతో కలిసి గన్పార్క్ చేరుకున్న వాణీదేవి... నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి: పీవీ ఘాట్ వద్ద వాణీదేవి నివాళులు.. నేడు నామినేషన్ దాఖలు