ETV Bharat / city

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు 'వై' కేటగిరి భద్రత

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయాల్లో లోపాలను ఎత్తి చూపుతూ.. నిత్యం వార్తలకెక్కుతున్న నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయన విజ్ఞప్తి మేరకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

author img

By

Published : Aug 6, 2020, 4:34 PM IST

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు 'వై' కేటగిరి భద్రత
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు 'వై' కేటగిరి భద్రత

ఏపీలోని తూర్పగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు 'వై' కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్రం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపా ఎమ్మెల్యేలతో తనకు ముప్పు ఉందని, ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో లోక్​సభ్ స్పీకర్​కు, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. తనకు భద్రత కల్పించాలని ఎంపీ కోరారు. రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి మేరకు అన్ని అంశాలను పరిశీలించిన హోంశాఖ, సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్​కి, సీఆర్పీఎఫ్ డీజీకి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలోని తూర్పగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు 'వై' కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్రం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపా ఎమ్మెల్యేలతో తనకు ముప్పు ఉందని, ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో లోక్​సభ్ స్పీకర్​కు, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. తనకు భద్రత కల్పించాలని ఎంపీ కోరారు. రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి మేరకు అన్ని అంశాలను పరిశీలించిన హోంశాఖ, సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్​కి, సీఆర్పీఎఫ్ డీజీకి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: 'కరోనా బాధితులను కాపాడేందుకు కొవిడ్ వారియర్స్ ముందుకు రావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.