దసరా శరన్నవరాత్రులు చివరి దశకు చేరుకున్నాయి. ఆఖరి రోజు బెజవాడ దుర్గమ్మ శ్రీ రాజ రాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్నారు. భారీగా చేరుకుంటున్న భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి 2 గంటల నుంచే రద్దీ పెరిగింది. క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. భవానీలతో కృష్ణవేణి ఘాట్ నిండిపోయింది. ఆ తల్లి చల్లని చూపు కోసం సామాన్య భక్తులతోపాటు ప్రముఖులూ కొండపైకి చేరుకుంటున్నారు. ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, భాజపా ఏపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఉన్నతాధికారులు కొందరు దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండి : 'జమ్మి చెట్టు దగ్గర ఇలా చేస్తే... అన్నింట్లో విజయం మీ సొంతం