విదేశాల నుంచి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై ఈ ఏడాది కస్టమ్స్ అధికారులు 89 కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ.21.72 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ, సిగరెట్లు, శాండిల్ఉడ్ అయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
62 కేసులు నమోదు చేసి రూ.15.10 కోట్ల విలువైన బంగారం, 7 కేసులు నమోదు చేసి 1.39 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ, 11 కేసులు నమోదు చేసి 5.20 కోట్ల విలువైన సిగరెట్లను, 9 కేసులు నమోదు చేసి రూ.3.15లక్షల విలువైన శాండిల్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గతేడాదిలో 140 కేసులు నమోదు కాగా ఈ ఏడాది లాక్డౌన్ కారణంగా విమానాల రాకపోకలు స్తంభించడంతో.. కేసులు సంఖ్య తగ్గిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి