ETV Bharat / city

'చలో గుంజపడుగు': ప్రశ్నిస్తే చంపేస్తారా?: రాజాసింగ్​ - పెద్దపల్లి జిల్లాలో న్యాయవాదుల హత్య

పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాదుల దారుణ హత్యలపై సీబీఐ, హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ డిమాండ్​ చేశారు. అలా చేస్తేనే అసలు కుట్ర బయటపడుతుందని అభిప్రాయపడ్డారు. 'చలో గుంజపడుగు' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

'చలో గుంజపడుగు': ప్రశ్నిస్తే చంపేస్తారా?: రాజాసింగ్​
'చలో గుంజపడుగు': ప్రశ్నిస్తే చంపేస్తారా?: రాజాసింగ్​
author img

By

Published : Feb 21, 2021, 9:35 AM IST

Updated : Feb 21, 2021, 11:31 AM IST

ప్రశ్నిస్తే చంపేస్తారా అని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రంలో న్యాయవాదుల త్యాగాలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. న్యాయవాద దంపతుల హత్యాకాండ ప్రభుత్వ హత్యలేనని రాజాసింగ్​ విమర్శించారు.

న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ.. భాజపా లీగల్​ సెల్​ ఆధ్వర్యంలో చలో గుంజపడుగు కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా భాజపా న్యాయవిభాగం ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ నుంచి గుంజపడుగుకు బయల్దేరింది. రెండు బస్సుల్లో న్యాయవాదులు పెద్దపల్లి జిల్లా వామనరావు స్వగ్రామం గుంజపడుగుకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పాల్గొంటారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

ప్రశ్నిస్తే చంపేస్తారా అని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రంలో న్యాయవాదుల త్యాగాలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. న్యాయవాద దంపతుల హత్యాకాండ ప్రభుత్వ హత్యలేనని రాజాసింగ్​ విమర్శించారు.

న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ.. భాజపా లీగల్​ సెల్​ ఆధ్వర్యంలో చలో గుంజపడుగు కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా భాజపా న్యాయవిభాగం ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ నుంచి గుంజపడుగుకు బయల్దేరింది. రెండు బస్సుల్లో న్యాయవాదులు పెద్దపల్లి జిల్లా వామనరావు స్వగ్రామం గుంజపడుగుకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పాల్గొంటారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

mla raja singh

ఇవీచూడండి: 'మంథనిలో లీగల్‌ ఫ్యాక్షన్‌ నడుస్తోంది'

Last Updated : Feb 21, 2021, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.