ETV Bharat / city

పోతిరెడ్డిపాడు టెండర్ ప్రక్రియను ప్రభుత్వం అడ్డుకోవాలి: భట్టి

author img

By

Published : Aug 4, 2020, 4:19 PM IST

పోతిరెడ్డిపాడు టెండర్​ ప్రక్రియను కేసీఆర్​ ప్రభుత్వం అడ్డుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం ముందుకొస్తే.. అపెక్స్​ కౌన్సిల్​ భేటీ వాయిదా వేయాలని కేసీఆర్​ కోరడంపై మండిపడ్డారు. ఎస్సీలకు రాజ్యాంగ రక్షణ కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై గవర్నర్​కు ఫిర్యాదుచేసినట్లు తెలిపారు.

BHATTI FIRES ON KCR OVER DEMANDING APEX COUNCIL POSTPONE
పోతిరెడ్డిపాడు టెండర్ ప్రక్రియను ప్రభుత్వం అడ్డుకోవాలి: భట్టి

పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వం జీవో ఇస్తే సీఎం కేసీఆర్​ స్పందించలేదని భట్టి ధ్వజమెత్తారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు ఎడారిగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు టెండర్ ప్రక్రియను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్​ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి అఫెక్స్​ కౌన్సిల్​ భేటీ నిర్వహిస్తామని కేంద్ర జలసంఘం ముందుకొస్తే.. కేసీఆర్​ వాయిదా వేయాలని కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

డీజీపీ స్పందించలేదు..

రాష్ట్రంలో అత్యంత దయనీయమైన పరిస్థితులున్నాయని భట్టి విక్రమార్క విమర్శించారు. ఎస్సీలపై దాడులు ఆగడం లేదని..వారికి రాజ్యాంగ రక్షణ కరవైందనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినా డీజీపీ, ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఎస్సీలపై దాడుల గురించి ఈ-మెయిల్ ద్వారా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

కరోనా విజృంభణ

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా విపరీతంగా విజృంభిస్తోందని భట్టి ఆరోపించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో హోంక్వారంటైన్​ కేంద్రాలు ఏర్పాటుచేయాలని డిమాండ్​ చేశారు. సర్కారు ఆస్పత్రుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ లేక అధిక బిల్లులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.

పోతిరెడ్డిపాడు టెండర్ ప్రక్రియను ప్రభుత్వం అడ్డుకోవాలి: భట్టి

ఇవీచూడండి: దేశం మొత్తం హైదరాబాద్‌ వైపే చూస్తోంది: కేటీఆర్​

పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వం జీవో ఇస్తే సీఎం కేసీఆర్​ స్పందించలేదని భట్టి ధ్వజమెత్తారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు ఎడారిగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు టెండర్ ప్రక్రియను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్​ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి అఫెక్స్​ కౌన్సిల్​ భేటీ నిర్వహిస్తామని కేంద్ర జలసంఘం ముందుకొస్తే.. కేసీఆర్​ వాయిదా వేయాలని కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

డీజీపీ స్పందించలేదు..

రాష్ట్రంలో అత్యంత దయనీయమైన పరిస్థితులున్నాయని భట్టి విక్రమార్క విమర్శించారు. ఎస్సీలపై దాడులు ఆగడం లేదని..వారికి రాజ్యాంగ రక్షణ కరవైందనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినా డీజీపీ, ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఎస్సీలపై దాడుల గురించి ఈ-మెయిల్ ద్వారా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

కరోనా విజృంభణ

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా విపరీతంగా విజృంభిస్తోందని భట్టి ఆరోపించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో హోంక్వారంటైన్​ కేంద్రాలు ఏర్పాటుచేయాలని డిమాండ్​ చేశారు. సర్కారు ఆస్పత్రుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ లేక అధిక బిల్లులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.

పోతిరెడ్డిపాడు టెండర్ ప్రక్రియను ప్రభుత్వం అడ్డుకోవాలి: భట్టి

ఇవీచూడండి: దేశం మొత్తం హైదరాబాద్‌ వైపే చూస్తోంది: కేటీఆర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.