ETV Bharat / city

అంగన్వాడీ ఆయా నిర్వాకం.. మూడేళ్ల బాలుడి మూతిపై వాత..

Anganwadi center Aaya harassed child: అంగన్వాడీ కేంద్రంలో ఉండటం లేదని మూడేళ్ల బాలుడిపై అమానుషంగా ప్రవర్తించింది ఓ ఆయా. చిన్నారి మూతిపై వాత పెట్టిందని బాలుడి తల్లి ఆరోపించారు. ఏపీలోని అనంతపురంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

author img

By

Published : Apr 23, 2022, 9:35 PM IST

ananthpuram-anganwadi-center-aaya-beaten-three-years-boy
ananthpuram-anganwadi-center-aaya-beaten-three-years-boy

Anganwadi center Aaya harassed child: అంగన్వాడీ కేంద్రంలో ఉండటం లేదని మూడేళ్ల బాలుడిపై.. అక్కడ పనిచేస్తున్న ఆయా చిన్నారి మూతిపై వాత పెట్టింది. అంగన్వాడీ ఆయా.. తన బిడ్డపై అమానుషంగా ప్రవర్తించిందని బాలుడి తల్లి ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కొవ్వూరు నగర్‌లో లక్ష్మీదేవి, శింగారెడ్డి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఈశ్వర్‌ కృష్ణారెడ్డి(3) సంతానం. కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి ఈ చిన్నారిని పంపిస్తున్నామని, రోజూలాగే ఈ రోజూ వదిలిపెట్టి వచ్చామని బాలుడి తల్లి పేర్కొన్నారు.

బాలుడు అమ్మ కావాలంటూ ఏడవడంతో ఆయా చెన్నమ్మ.. బాబు మూతిపై వాత పెట్టిందని తల్లి ఆరోపించింది. దీంతో.. చిన్నారి మూతిపై బొబ్బలు వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత కర్రతో కొట్టిందని.. బాలుడి కాళ్లు, వీపుపై వాతలు పడి ఎర్రగా కమిలిపోయాయని వివరించింది. ఆయాపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఫోనులో మాట్లాడి ఆరా తీశారు. స్థానిక అధికారులు అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేపట్టారు.

'బాబుకు మూడేళ్లు నిండాయి కదా.. స్కూల్​ అలవాటు కావాలని ఆయా పంపించమంటే మూడు రోజులుగా అంగన్వాడీకి పంపిస్తున్నాను. నేను పక్క వీధిలోనే ఉంటాను. బాబు అమ్మ కావాలని అడిగాడంట. ఏడ్చుకుంటూ మా ఇంటివైపు వస్తున్నాడంట. దీంతో ఆమె కర్ర తీసుకుని నా బిడ్డను కొడుతూ ఉండటాన్ని మా వీధిలో ఉండే అమ్మాయి చూసిందట. ఆయాపై వెంటనే చర్యలు తీసుకోవాలి.' -లక్ష్మీ దేవి, బాలుడి తల్లి

ఇవీ చదవండి :

Anganwadi center Aaya harassed child: అంగన్వాడీ కేంద్రంలో ఉండటం లేదని మూడేళ్ల బాలుడిపై.. అక్కడ పనిచేస్తున్న ఆయా చిన్నారి మూతిపై వాత పెట్టింది. అంగన్వాడీ ఆయా.. తన బిడ్డపై అమానుషంగా ప్రవర్తించిందని బాలుడి తల్లి ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కొవ్వూరు నగర్‌లో లక్ష్మీదేవి, శింగారెడ్డి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఈశ్వర్‌ కృష్ణారెడ్డి(3) సంతానం. కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి ఈ చిన్నారిని పంపిస్తున్నామని, రోజూలాగే ఈ రోజూ వదిలిపెట్టి వచ్చామని బాలుడి తల్లి పేర్కొన్నారు.

బాలుడు అమ్మ కావాలంటూ ఏడవడంతో ఆయా చెన్నమ్మ.. బాబు మూతిపై వాత పెట్టిందని తల్లి ఆరోపించింది. దీంతో.. చిన్నారి మూతిపై బొబ్బలు వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత కర్రతో కొట్టిందని.. బాలుడి కాళ్లు, వీపుపై వాతలు పడి ఎర్రగా కమిలిపోయాయని వివరించింది. ఆయాపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఫోనులో మాట్లాడి ఆరా తీశారు. స్థానిక అధికారులు అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేపట్టారు.

'బాబుకు మూడేళ్లు నిండాయి కదా.. స్కూల్​ అలవాటు కావాలని ఆయా పంపించమంటే మూడు రోజులుగా అంగన్వాడీకి పంపిస్తున్నాను. నేను పక్క వీధిలోనే ఉంటాను. బాబు అమ్మ కావాలని అడిగాడంట. ఏడ్చుకుంటూ మా ఇంటివైపు వస్తున్నాడంట. దీంతో ఆమె కర్ర తీసుకుని నా బిడ్డను కొడుతూ ఉండటాన్ని మా వీధిలో ఉండే అమ్మాయి చూసిందట. ఆయాపై వెంటనే చర్యలు తీసుకోవాలి.' -లక్ష్మీ దేవి, బాలుడి తల్లి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.