ETV Bharat / city

వైద్యుల వ్యథ: కుటుంబాలకు దూరం... తిండీ తినలేని దైన్యం

author img

By

Published : Jun 14, 2020, 10:25 PM IST

చెన్నైలోని రాజీవ్​ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో 90మంది వైద్యులు కరోనా బారినపడ్డారు. వీరిలో వైరస్​ రోగులకు చికిత్స అందించినవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

కుటుంబాలకు దూరంగా కడుపునిండా తినే సమయం లేక వైద్యుల ఇక్కట్లు
కుటుంబాలకు దూరంగా కడుపునిండా తినే సమయం లేక వైద్యుల ఇక్కట్లు

తమిళనాడులో కరోనా వైరస్​ రోజురోజుకూ విజృంభిస్తోంది. చికిత్స అందించే వైద్యులు కూడా వైరస్​ బారినపడుతున్నారు. తాజాగా చెన్నైలోని రాజీవ్​ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో 90మంది వైద్యులకు వైరస్​ సోకినట్లు ఓ అధికారి తెలిపారు.

"10రోజుల వ్యవధిలో 80-90మంది వైద్యులకు కరోనా పాజిటివ్​గా తేలింది. వీరిలో చాలా తక్కువమంది డాక్టర్లు.. కరోనా బాధితులకు చికిత్స అందించారు. మిగిలిన వారు వివిధ విభాగాలకు చెందినవారు."

-- అధికారి.

ఆసుపత్రిలో వైద్యుల కొరత వల్ల.. దాదాపు 300మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి బదిలీ అయ్యారు. తాము కడుపునిండా తిని, నిద్రపోయి.. 3 నెలలయ్యిందని, కుటుంబ సభ్యులతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదని అధికారి పేర్కొన్నారు. వాట్సాప్​, ఇతర సాంకేతికతతోనే కుటుంబ సభ్యులను చూస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:- కరోనా బాధితుల్లో ఉండే 8 ప్రధాన లక్షణాలివే

తమిళనాడులో కరోనా వైరస్​ రోజురోజుకూ విజృంభిస్తోంది. చికిత్స అందించే వైద్యులు కూడా వైరస్​ బారినపడుతున్నారు. తాజాగా చెన్నైలోని రాజీవ్​ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో 90మంది వైద్యులకు వైరస్​ సోకినట్లు ఓ అధికారి తెలిపారు.

"10రోజుల వ్యవధిలో 80-90మంది వైద్యులకు కరోనా పాజిటివ్​గా తేలింది. వీరిలో చాలా తక్కువమంది డాక్టర్లు.. కరోనా బాధితులకు చికిత్స అందించారు. మిగిలిన వారు వివిధ విభాగాలకు చెందినవారు."

-- అధికారి.

ఆసుపత్రిలో వైద్యుల కొరత వల్ల.. దాదాపు 300మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి బదిలీ అయ్యారు. తాము కడుపునిండా తిని, నిద్రపోయి.. 3 నెలలయ్యిందని, కుటుంబ సభ్యులతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదని అధికారి పేర్కొన్నారు. వాట్సాప్​, ఇతర సాంకేతికతతోనే కుటుంబ సభ్యులను చూస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:- కరోనా బాధితుల్లో ఉండే 8 ప్రధాన లక్షణాలివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.