ETV Bharat / city

Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు, ఒకరు మృతి

author img

By

Published : Sep 10, 2021, 7:08 PM IST

Updated : Sep 10, 2021, 7:27 PM IST

Corona Cases
కరోనా కేసులు

18:55 September 10

Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు, ఒకరు మృతి

   రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,61,006కి చేరింది.  వైరస్​తో తాజాగా ఒకరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 3,892కు పెరిగింది.  కొవిడ్​ నుంచి మరో 338 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 6,51,763కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 5,351 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. వారిలో కొందరు హోం ఐసోలేషన్​లో ఉండగా మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ 51,004 మందికి కరోనా పరీక్షలు పరీక్షలు నిర్వహించారు. 

   ప్రభుత్వ పీహెచ్​సీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 45,063 టెస్టులు నిర్వహించారు ఇందులో 21 ఆర్టీపీసీఆర్​ పరీక్షలు ఉండగా మిగతావి అంటిజెన్​ పరీక్షలు ఉన్నాయి. ప్రైవేట్​లో 5,941 పరీక్షలు చేశారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 98.6 శాతంగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్​ఎంసీలో అత్యధికంగా 71 కేసులు నమోదయ్యాయి. 

   ఆదిలాబాద్ జిల్లాలో​ 3, భద్రాద్రి కొత్తగూడెం 9, జగిత్యాల 6, జనగామ 3, కరీంనగర్​ 11, ఖమ్మం 12, కుమురం భీం ఆసిఫాబాద్​ 1, మహబూబ్​నగర్​ 4, మహబూబాబాద్​ 2, మంచిర్యాల 4, మెదక్​ 1, మేడ్చాల్​ మల్కాజిగిరి 8, ములుగు 4, నాగర్​ కర్నూల్​ 1, నల్గొండ17, నిజామాబాద్​ 1, పెద్దపల్లి 7, రాజన్న సిరిసిల్ల 3, రంగారెడ్డి 12, సంగారెడ్డి 2, సిద్దిపేట 6, సూర్యాపేట 7, వనపర్తి 1, వరంగల్​ 9, హనుమకొండ 11, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 కేసులొచ్చాయి. జయశంకర్​ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్​, వికారాబాద్​ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఇదీ చదవండి: Rape On Child: అందరు అనుమానించిందే నిజమైంది.. చిన్నారిని వాడే చిదిమేశాడు..

18:55 September 10

Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు, ఒకరు మృతి

   రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,61,006కి చేరింది.  వైరస్​తో తాజాగా ఒకరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 3,892కు పెరిగింది.  కొవిడ్​ నుంచి మరో 338 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 6,51,763కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 5,351 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. వారిలో కొందరు హోం ఐసోలేషన్​లో ఉండగా మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ 51,004 మందికి కరోనా పరీక్షలు పరీక్షలు నిర్వహించారు. 

   ప్రభుత్వ పీహెచ్​సీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 45,063 టెస్టులు నిర్వహించారు ఇందులో 21 ఆర్టీపీసీఆర్​ పరీక్షలు ఉండగా మిగతావి అంటిజెన్​ పరీక్షలు ఉన్నాయి. ప్రైవేట్​లో 5,941 పరీక్షలు చేశారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 98.6 శాతంగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్​ఎంసీలో అత్యధికంగా 71 కేసులు నమోదయ్యాయి. 

   ఆదిలాబాద్ జిల్లాలో​ 3, భద్రాద్రి కొత్తగూడెం 9, జగిత్యాల 6, జనగామ 3, కరీంనగర్​ 11, ఖమ్మం 12, కుమురం భీం ఆసిఫాబాద్​ 1, మహబూబ్​నగర్​ 4, మహబూబాబాద్​ 2, మంచిర్యాల 4, మెదక్​ 1, మేడ్చాల్​ మల్కాజిగిరి 8, ములుగు 4, నాగర్​ కర్నూల్​ 1, నల్గొండ17, నిజామాబాద్​ 1, పెద్దపల్లి 7, రాజన్న సిరిసిల్ల 3, రంగారెడ్డి 12, సంగారెడ్డి 2, సిద్దిపేట 6, సూర్యాపేట 7, వనపర్తి 1, వరంగల్​ 9, హనుమకొండ 11, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 కేసులొచ్చాయి. జయశంకర్​ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్​, వికారాబాద్​ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఇదీ చదవండి: Rape On Child: అందరు అనుమానించిందే నిజమైంది.. చిన్నారిని వాడే చిదిమేశాడు..

Last Updated : Sep 10, 2021, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.