ETV Bharat / city

లాక్​డౌన్ ఆంక్షలు కఠినతరం.. ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం

author img

By

Published : May 22, 2021, 11:10 AM IST

Updated : May 22, 2021, 11:27 AM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. పాస్ హోల్డర్లు తప్ప ఎవరు బయటకు వచ్చినా వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​లో లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

telangana lockdown, telangana lockdown 2021
తెలంగాణ లాక్​డౌన్, తెలంగాణ లాక్​డౌన్ 2021

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. పాస్​లున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు.

లాక్​డౌన్ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం

హైదరాబాద్​లోని దిల్​సుఖ్​నగర్​లో సడలింపు సమయం తర్వాత బయటకు వచ్చిన వాహనదారులను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా బయటకు వచ్చిన వాహనాలు సీజ్ చేశారు. మరోసారి బయటకు వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

పల్లెల్లో తప్ప.. పట్టణాల్లోల లాక్​డౌన్ పటిష్ఠంగా అమలు కావడం లేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో.. పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. ప్రజలంతా లాక్​డౌన్​ నియమాలు తప్పక పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని చెప్పారు.

హైదరాబాద్​లో లాక్​డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని సీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. అనవసరంగా బయటకొస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు పహారా ఉన్నారని.. అనుమతి లేకుండా బయటకొచ్చిన వారు తప్పించుకోలేరని అన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పోలీసులకు సహకరించాలని కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. పాస్​లున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు.

లాక్​డౌన్ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం

హైదరాబాద్​లోని దిల్​సుఖ్​నగర్​లో సడలింపు సమయం తర్వాత బయటకు వచ్చిన వాహనదారులను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా బయటకు వచ్చిన వాహనాలు సీజ్ చేశారు. మరోసారి బయటకు వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

పల్లెల్లో తప్ప.. పట్టణాల్లోల లాక్​డౌన్ పటిష్ఠంగా అమలు కావడం లేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో.. పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. ప్రజలంతా లాక్​డౌన్​ నియమాలు తప్పక పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని చెప్పారు.

హైదరాబాద్​లో లాక్​డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని సీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. అనవసరంగా బయటకొస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు పహారా ఉన్నారని.. అనుమతి లేకుండా బయటకొచ్చిన వారు తప్పించుకోలేరని అన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పోలీసులకు సహకరించాలని కోరారు.

Last Updated : May 22, 2021, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.