ETV Bharat / business

ఆర్థిక షేర్ల జోరుతో మార్కెట్లకు భారీ లాభాలు

author img

By

Published : Jul 5, 2021, 3:42 PM IST

బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్ల దూకుడుతో స్టాక్ మార్కెట్లు(Stock Markets) భారీ లాభాలు గడించాయి. సెన్సెక్స్​ 395 పాయింట్లు వృద్ధి చెందగా.. నిఫ్టీ 120 పాయింట్లు ఎగబాకింది.

stock-market-live-updates
మార్కెట్లకు భారీ లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 395 పాయింట్లు వృద్ధి చెందింది. 0.75 శాతం లాభంతో 52,880 వద్ద ట్రేడింగ్ ముగించింది.

మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం భారీ లాభాలు గడించింది. 120 పాయింట్లు ఎగబాకి 15,841 పాయింట్ల వద్ద స్థిరపడింది.

సోమవారం సెషన్​లో లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు రాణించాయి. సెన్సెక్స్ 30లో ఎస్​బీఐ అత్యధికంగా 2 శాతం లాభపడింది. టెక్ మహీంద్ర అధికంగా నష్టాలపాలైంది. టైటాన్, డాక్టర్ రెడ్డీస్, సన్​ఫార్మా సంస్థల షేర్లు నేల చూపులు చూశాయి.

ఇదీ చదవండి: బెజోస్​కు ఆఖరి రోజు.. కొత్త సీఈఓ ఆండీ జాస్సీ

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 395 పాయింట్లు వృద్ధి చెందింది. 0.75 శాతం లాభంతో 52,880 వద్ద ట్రేడింగ్ ముగించింది.

మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం భారీ లాభాలు గడించింది. 120 పాయింట్లు ఎగబాకి 15,841 పాయింట్ల వద్ద స్థిరపడింది.

సోమవారం సెషన్​లో లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు రాణించాయి. సెన్సెక్స్ 30లో ఎస్​బీఐ అత్యధికంగా 2 శాతం లాభపడింది. టెక్ మహీంద్ర అధికంగా నష్టాలపాలైంది. టైటాన్, డాక్టర్ రెడ్డీస్, సన్​ఫార్మా సంస్థల షేర్లు నేల చూపులు చూశాయి.

ఇదీ చదవండి: బెజోస్​కు ఆఖరి రోజు.. కొత్త సీఈఓ ఆండీ జాస్సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.