ETV Bharat / business

సరికొత్త శిఖరాలకు సూచీలు - సెన్సెక్స్​ 160 ప్లస్​ - స్టాక్​ మార్కెట్లు

Market LIVE Updates
మార్కెట్ల ఆల్​టైం రికార్డ్
author img

By

Published : Sep 24, 2021, 9:20 AM IST

Updated : Sep 24, 2021, 3:47 PM IST

15:39 September 24

స్టాక్ మార్కెట్లు శుక్రవారం  జీవితకాల గరిష్ఠాలను చేరి కొత్త రికార్డు సృష్టించాయి. సెన్సెక్స్​ 163 పాయింట్లు లాభపడి 60,048 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు వృద్ధి చెంది 17,853కి చేరింది. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు, మోదీ అమెరికా పర్యటన మదుపర్లలో ఉత్సాహాన్ని నింపడం వల్ల సూచీలు పరుగులు పెట్టాయి.

09:17 September 24

సరికొత్త శిఖరాలకు సూచీలు - సెన్సెక్స్​ 160 ప్లస్​

భారత స్టాక్​ మార్కెట్లు(Stock markets) చరిత్ర సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు, హెవీ వెయిట్​ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరాయి.  బీఎస్​ఈ సెన్సెక్స్​(BSE sensex).. తొలిసారి 60వేల మైలురాయిని అధిగమించింది​. నిఫ్టీ జీవితకాల గరిష్ఠాన్ని తాకి.. 18 వేల పాయింట్లకు చేరువలోకి వచ్చింది.  

బాంబే స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్​.. 300 పాయింట్లకుపైగా లాభంతో 60,230కిపైగా పాయింట్లతో కొనసాగుతోంది.  

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 104.55 పాయింట్ల లాభంతో 17,931 వద్ద కొనసాగుతోంది.  

లాభనష్టాల్లోనివి..

టాటా మోటర్స్​, ఓఎన్​జీసీ, ఇన్​ఫోసిస్​, విప్రో, ఎల్​అండ్​టీ షేర్లు దూసుకెళ్లాయి. ఐటీ రంగం సుమారు ఒక శాతం మేర లాభపడ్డాయి. మరోవైపు.. హిందాల్కో, జెఎస్​డబ్ల్యూ స్టీల్​, హెచ్​యూఎల్​, టాటా స్టీల్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.  

15:39 September 24

స్టాక్ మార్కెట్లు శుక్రవారం  జీవితకాల గరిష్ఠాలను చేరి కొత్త రికార్డు సృష్టించాయి. సెన్సెక్స్​ 163 పాయింట్లు లాభపడి 60,048 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు వృద్ధి చెంది 17,853కి చేరింది. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు, మోదీ అమెరికా పర్యటన మదుపర్లలో ఉత్సాహాన్ని నింపడం వల్ల సూచీలు పరుగులు పెట్టాయి.

09:17 September 24

సరికొత్త శిఖరాలకు సూచీలు - సెన్సెక్స్​ 160 ప్లస్​

భారత స్టాక్​ మార్కెట్లు(Stock markets) చరిత్ర సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు, హెవీ వెయిట్​ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరాయి.  బీఎస్​ఈ సెన్సెక్స్​(BSE sensex).. తొలిసారి 60వేల మైలురాయిని అధిగమించింది​. నిఫ్టీ జీవితకాల గరిష్ఠాన్ని తాకి.. 18 వేల పాయింట్లకు చేరువలోకి వచ్చింది.  

బాంబే స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్​.. 300 పాయింట్లకుపైగా లాభంతో 60,230కిపైగా పాయింట్లతో కొనసాగుతోంది.  

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 104.55 పాయింట్ల లాభంతో 17,931 వద్ద కొనసాగుతోంది.  

లాభనష్టాల్లోనివి..

టాటా మోటర్స్​, ఓఎన్​జీసీ, ఇన్​ఫోసిస్​, విప్రో, ఎల్​అండ్​టీ షేర్లు దూసుకెళ్లాయి. ఐటీ రంగం సుమారు ఒక శాతం మేర లాభపడ్డాయి. మరోవైపు.. హిందాల్కో, జెఎస్​డబ్ల్యూ స్టీల్​, హెచ్​యూఎల్​, టాటా స్టీల్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.  

Last Updated : Sep 24, 2021, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.