ETV Bharat / business

ఐటీఆర్​ల స్క్రూట్నీ భారీగా తగ్గించిన ఆర్థిక శాఖ

ఐటీఆర్​ల స్క్రూట్నీ సంఖ్యను మరో సారి భారీగా తగ్గించింది ఆర్థిక శాఖ. 2018-19 మదింపు సంవత్సరానికి దాఖలైన మొత్తం ఐటీఆర్​లలో 0.25 శాతం రిటర్నులను పరిశీలనకు ఎంపిక చేసింది. సంఖ్యా పరంగా మాత్రం ఎన్ని రిటర్నులను ఎంపిక చేసిన విషయం వెల్లడించలేదు.

author img

By

Published : Aug 5, 2020, 12:24 PM IST

ITR scrutiny reduced
ఐటీఆర్​ల స్క్రూట్నీ

2018-19 మదింపు సంవత్సరానికి సంబంధించి పరిశీలన(స్క్రూట్నీ) కోసం ఎంపిక చేసిన ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్​)లు భారీగా తగ్గాయి. దాఖలైన మొత్తం ఐటీఆర్​లలో 0.25 శాతం పరిశీలనకు ఎంపిక చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతకు ముందు 2017-18 మదింపు సంవత్సరంలో ఇవి 0.55 శాతంగా ఉన్నాయి.

గతంలో చూస్తే పరిశీలన కోసం ఎంపిక చేసిన ఐటీఆర్​లు.. 2015-16లో 0.71 శాతం, 2016-17లో 0.40 శాతంగా ఉన్నాయి.

అయితే ఈ ఏడాది మొత్తం ఎన్ని ఐటీఆర్​లను పరిశీలనకు (సంఖ్యా పరంగా) తీసుకున్న విషయం మాత్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు.

పన్ను చెల్లింపుదారులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ఆదాయ శాఖ మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఏటా పరిశీలనకు ఎంపిక చేసే ఐటీఆర్​ల సంఖ్యను కూడా తగ్గిస్తూ వస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

రాష్ట్రాల వారీగా..

రాష్ట్రాల వారీగా కూడా 2018-19 మదింపు సంవత్సరానికి పరిశీలన కోసం ఎంపిక చేసిన ఐటీఆర్​లు భారీగా తగ్గాయి.

ఒడిశా నుంచి అత్యల్పంగా 0.12 శాతం, పంజాబ్​ నుంచి 0.14 శాతం ఐటీఆర్​లను పరిశీలనకు ఎంపిక చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. 2018-19 మందిపు సంవత్సరానికి ఒడిశా నుంచి 10.29 లక్షలు, పంజాబ్​ నుంచి 27.65 లక్షల ఐటీఆర్​లు దాఖలయ్యాయి.

బంగాల్​ నుంచి 2018-19 మందిపు సంవత్సరానికి మొత్తం 38.93 లక్షల ఐటీఆర్​లు దాఖలయ్యాయి. వాటిలో 0.25 శాతం పరిశీలనకు ఎంపిక చేసింది ఆర్థిక శాఖ.

ఇదీ చూడండి:డేటా సెంటర్ల డిమాండ్​తో స్థిరాస్తి రంగం పరుగు!

2018-19 మదింపు సంవత్సరానికి సంబంధించి పరిశీలన(స్క్రూట్నీ) కోసం ఎంపిక చేసిన ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్​)లు భారీగా తగ్గాయి. దాఖలైన మొత్తం ఐటీఆర్​లలో 0.25 శాతం పరిశీలనకు ఎంపిక చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతకు ముందు 2017-18 మదింపు సంవత్సరంలో ఇవి 0.55 శాతంగా ఉన్నాయి.

గతంలో చూస్తే పరిశీలన కోసం ఎంపిక చేసిన ఐటీఆర్​లు.. 2015-16లో 0.71 శాతం, 2016-17లో 0.40 శాతంగా ఉన్నాయి.

అయితే ఈ ఏడాది మొత్తం ఎన్ని ఐటీఆర్​లను పరిశీలనకు (సంఖ్యా పరంగా) తీసుకున్న విషయం మాత్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు.

పన్ను చెల్లింపుదారులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ఆదాయ శాఖ మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఏటా పరిశీలనకు ఎంపిక చేసే ఐటీఆర్​ల సంఖ్యను కూడా తగ్గిస్తూ వస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

రాష్ట్రాల వారీగా..

రాష్ట్రాల వారీగా కూడా 2018-19 మదింపు సంవత్సరానికి పరిశీలన కోసం ఎంపిక చేసిన ఐటీఆర్​లు భారీగా తగ్గాయి.

ఒడిశా నుంచి అత్యల్పంగా 0.12 శాతం, పంజాబ్​ నుంచి 0.14 శాతం ఐటీఆర్​లను పరిశీలనకు ఎంపిక చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. 2018-19 మందిపు సంవత్సరానికి ఒడిశా నుంచి 10.29 లక్షలు, పంజాబ్​ నుంచి 27.65 లక్షల ఐటీఆర్​లు దాఖలయ్యాయి.

బంగాల్​ నుంచి 2018-19 మందిపు సంవత్సరానికి మొత్తం 38.93 లక్షల ఐటీఆర్​లు దాఖలయ్యాయి. వాటిలో 0.25 శాతం పరిశీలనకు ఎంపిక చేసింది ఆర్థిక శాఖ.

ఇదీ చూడండి:డేటా సెంటర్ల డిమాండ్​తో స్థిరాస్తి రంగం పరుగు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.