ETV Bharat / business

దేశీయ కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను తగ్గింపు:నిర్మల

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉద్దీపన చర్యల్లో భాగంగా దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును తగ్గించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. జీఎస్టీ భేటీకి ముందు మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటనలు చేశారు.

author img

By

Published : Sep 20, 2019, 12:02 PM IST

Updated : Oct 1, 2019, 7:44 AM IST

దేశీయ కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను తగ్గింపు:నిర్మల

మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ కంపెనీలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తున్నట్లు గోవాలో జీఎస్టీ సమావేశానికి ముందు ప్రకటించారు.

సెస్, సర్‌చార్జీలు లేకుండా దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ సెస్, సర్‌ చార్జీలు ఉంటే మాత్రం ఇదే పన్ను రేటు 25.17 శాతం ఉంటుందని చెప్పారు. ఈ కొత్త పన్ను రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు నిర్మల. కార్పొరేట్ పన్ను తగ్గించడం ద్వారా వచ్చే రాబడి ఏటా 1.45 లక్షల కోట్ల రూపాయలు తగ్గుతుందని అంచనా వేశారు.

దేశంలో పెట్టుబడి, వృద్ధిని ప్రోత్సహించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు నిర్మల. ఆదాయపు పన్ను చట్టంలో చేసిన మార్పులను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. 22 శాతం ఆదాయపు పన్ను స్లాబ్‌ను ఎంచుకునే కంపెనీలు కనీస ప్రత్యామ్నాయ పన్ను మ్యాట్‌ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అక్టోబర్ 1 తర్వాత కొత్తగా వచ్చిన దేశీయ తయారీ సంస్థలు ఎటువంటి ప్రోత్సాహకాలు లేకుండా 15 శాతం చొప్పున ఆదాయపు పన్ను చెల్లించవచ్చని తెలిపారు. అయితే.. కొత్త ఉత్పాదక సంస్థలకు సమర్థవంతమైన పన్ను రేటు అన్ని సర్‌చార్జీలు, సెస్‌లతో కలిపితే 17.1 శాతం ఉంటుందన్నారు.

ఇదీ చూడండి: జీఎస్​టీ భేటీ: వాహన రంగానికి ఈరట లభించేనా..?

మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ కంపెనీలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తున్నట్లు గోవాలో జీఎస్టీ సమావేశానికి ముందు ప్రకటించారు.

సెస్, సర్‌చార్జీలు లేకుండా దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ సెస్, సర్‌ చార్జీలు ఉంటే మాత్రం ఇదే పన్ను రేటు 25.17 శాతం ఉంటుందని చెప్పారు. ఈ కొత్త పన్ను రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు నిర్మల. కార్పొరేట్ పన్ను తగ్గించడం ద్వారా వచ్చే రాబడి ఏటా 1.45 లక్షల కోట్ల రూపాయలు తగ్గుతుందని అంచనా వేశారు.

దేశంలో పెట్టుబడి, వృద్ధిని ప్రోత్సహించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు నిర్మల. ఆదాయపు పన్ను చట్టంలో చేసిన మార్పులను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. 22 శాతం ఆదాయపు పన్ను స్లాబ్‌ను ఎంచుకునే కంపెనీలు కనీస ప్రత్యామ్నాయ పన్ను మ్యాట్‌ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అక్టోబర్ 1 తర్వాత కొత్తగా వచ్చిన దేశీయ తయారీ సంస్థలు ఎటువంటి ప్రోత్సాహకాలు లేకుండా 15 శాతం చొప్పున ఆదాయపు పన్ను చెల్లించవచ్చని తెలిపారు. అయితే.. కొత్త ఉత్పాదక సంస్థలకు సమర్థవంతమైన పన్ను రేటు అన్ని సర్‌చార్జీలు, సెస్‌లతో కలిపితే 17.1 శాతం ఉంటుందన్నారు.

ఇదీ చూడండి: జీఎస్​టీ భేటీ: వాహన రంగానికి ఈరట లభించేనా..?

AP Video Delivery Log - 0400 GMT News
Friday, 20 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0359: Philippines Polio AP Clients Only 4230882
Immunisation begins in Philippine polio outbreak
AP-APTN-0355: Honduras Dengue AP Clients Only 4230876
Deadly dengue epidemic in Honduras
AP-APTN-0300: Australia Climate Protest No access Australia 4230878
Climate change protests kick off in Australia
AP-APTN-0224: Canada Trudeau Brownface Must credit CTV; No access Canada 4230874
Trudeau apologises again for brownface
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.