ETV Bharat / business

పెట్రో మంట తగ్గుతుందన్న ఆశతో లాభాలు

author img

By

Published : Apr 26, 2019, 4:21 PM IST

Updated : Apr 26, 2019, 5:34 PM IST

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం మదుపర్లలో ఉత్సాహం నింపింది. వారంలో చివరి సెషన్​ను లాభాలతో ముగించాయి స్టాక్​ మార్కెట్లు.

స్టాక్​ మార్కెట్లు

వారమంతా ఒడుదొడుకుల నడుమ సాగిన స్టాక్​ మార్కెట్లు వారం చివరి రోజు భారీగా లాభపడ్డాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 336.47 పాయింట్ల లాభపడి తిరిగి 39 వేల మార్కును దాటిది. మార్కెట్లు ముగిసే సమయానికి 39,067.33 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 112.85 పాయింట్లు పుంజుకుని 11,754.65 వద్ద సెషన్​ ముగించింది.

ఆర్థిక, లోహ సాంకేతిక రంగాలు నేడు లాభపడ్డాయి. ఆటోమొబైల్​ రంగం అత్యధికంగా నష్టాలు మూటగట్టుకుంది.

వారం మొత్తం మీద చూస్తే సెన్సెక్స్​ దాదాపు 154 పాయింట్లు నష్టపోయింది.

ఇంట్రాడే సాగిందిలా

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్ 39,103.16 38,765.33
నిఫ్టీ 11,762.90 11,661.75

ఇదీ కారణం

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల ప్రవాహం నేటి లాభాలకు ప్రధాన కారణం.

లాభానష్టాల్లోనివివే

వార్షిక ఫలితాలు అందించిన ఊతంతో టాటా స్టీల్​ అత్యధికంగా 6.67 శాతం లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంకు 3.05 శాతం, యాక్సిస్​ బ్యాంకు 2.61 శాతం, టీసీఎస్​ 2.13శాతం, ఎస్​బీఐ 1.96 శాతం, రిలయన్స్​ 1.23 శాతం పెరిగాయి.

టాటా మోటార్స్ అత్యధికంగా​ 2.84 శాతం నష్టపోయింది. బజాజ్​ ఆటో 1.21 శాతం, మారుతి 1.03 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 1.02 శాతం, ఎం అండ్​ ఎం 0.94 శాతం, వేదాంత 0.70 శాతం నష్టాలు నమోదుచేశాయి.

30 షేర్ల ఇండెక్స్​లో 18 షేర్లు లాభాలు నమోదు చేయగా... 12 షేర్లు నష్టాల్లో ముగిశాయి.

50 షేర్ల నిఫ్టీ ప్యాక్​లో 33 షేర్లు లాభాల్లో ముగియగా 16 షేర్లు నష్టాలు నమోదు చేశాయి. ఏషియన్​ పెయింట్స్​ షేర్లలో పెద్దగా మార్పులేదు.

రూపాయి, ముడి చమురు

నేటి ట్రేడింగ్​లో రూపాయి 25 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.70గా నమోదైంది.

ముడి చమురు ధరల చూచీ బ్రెంట్​ ఈ ఒక్క రోజే 1.28 శాతం తగ్గింది. ఈ కారణంగా గత సెషన్​తో పోలిస్తే బ్యారెల్​ ముడిచమురు ధర 75 డాలర్ల నుంచి 73.41 డాలర్లకు దిగొచ్చింది.

ఇతర మార్కెట్లు సాగాయిలా

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లయిన షాంఘై సూచీ, జపాన్​ సూచీ నిక్కీ, దక్షిణ కొరియా సూచీ- కోస్పీ నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

వారమంతా ఒడుదొడుకుల నడుమ సాగిన స్టాక్​ మార్కెట్లు వారం చివరి రోజు భారీగా లాభపడ్డాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 336.47 పాయింట్ల లాభపడి తిరిగి 39 వేల మార్కును దాటిది. మార్కెట్లు ముగిసే సమయానికి 39,067.33 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 112.85 పాయింట్లు పుంజుకుని 11,754.65 వద్ద సెషన్​ ముగించింది.

ఆర్థిక, లోహ సాంకేతిక రంగాలు నేడు లాభపడ్డాయి. ఆటోమొబైల్​ రంగం అత్యధికంగా నష్టాలు మూటగట్టుకుంది.

వారం మొత్తం మీద చూస్తే సెన్సెక్స్​ దాదాపు 154 పాయింట్లు నష్టపోయింది.

ఇంట్రాడే సాగిందిలా

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్ 39,103.16 38,765.33
నిఫ్టీ 11,762.90 11,661.75

ఇదీ కారణం

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల ప్రవాహం నేటి లాభాలకు ప్రధాన కారణం.

లాభానష్టాల్లోనివివే

వార్షిక ఫలితాలు అందించిన ఊతంతో టాటా స్టీల్​ అత్యధికంగా 6.67 శాతం లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంకు 3.05 శాతం, యాక్సిస్​ బ్యాంకు 2.61 శాతం, టీసీఎస్​ 2.13శాతం, ఎస్​బీఐ 1.96 శాతం, రిలయన్స్​ 1.23 శాతం పెరిగాయి.

టాటా మోటార్స్ అత్యధికంగా​ 2.84 శాతం నష్టపోయింది. బజాజ్​ ఆటో 1.21 శాతం, మారుతి 1.03 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 1.02 శాతం, ఎం అండ్​ ఎం 0.94 శాతం, వేదాంత 0.70 శాతం నష్టాలు నమోదుచేశాయి.

30 షేర్ల ఇండెక్స్​లో 18 షేర్లు లాభాలు నమోదు చేయగా... 12 షేర్లు నష్టాల్లో ముగిశాయి.

50 షేర్ల నిఫ్టీ ప్యాక్​లో 33 షేర్లు లాభాల్లో ముగియగా 16 షేర్లు నష్టాలు నమోదు చేశాయి. ఏషియన్​ పెయింట్స్​ షేర్లలో పెద్దగా మార్పులేదు.

రూపాయి, ముడి చమురు

నేటి ట్రేడింగ్​లో రూపాయి 25 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.70గా నమోదైంది.

ముడి చమురు ధరల చూచీ బ్రెంట్​ ఈ ఒక్క రోజే 1.28 శాతం తగ్గింది. ఈ కారణంగా గత సెషన్​తో పోలిస్తే బ్యారెల్​ ముడిచమురు ధర 75 డాలర్ల నుంచి 73.41 డాలర్లకు దిగొచ్చింది.

ఇతర మార్కెట్లు సాగాయిలా

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లయిన షాంఘై సూచీ, జపాన్​ సూచీ నిక్కీ, దక్షిణ కొరియా సూచీ- కోస్పీ నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


Jaipur (Rajasthan), Apr 26 (ANI): Chairman of Indian Overseas Congress Department Sam Pitroda hit at Bharatiya Janata Party (BJP) government and its work-style of last 5 years. Pitroda said, "In these 5 years, we saw that lots of promises were made. They said, they would make 100 smart cities, they'd create 100 million jobs, they'd bring back the black money but when we look at the record of this government, it is very clear that nothing has been accomplished, except lots of false promises. They lied to people, provoked them and sometime people consider these lies as truth. You even witnessed what happened after demonetisation, after GST. I even talked to a businessman while I was in airport and he told me how small businesses got affected in these 5 years. In a sense, according to me, democracy has been hijacked, freedom has been curbed, very few people are willing to speak up, media, according to me, has not been very fair. The truth didn't get the space, it should get. "
Last Updated : Apr 26, 2019, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.