ETV Bharat / business

ఇక రుణ రహితంగా అంబానీ సామ్రాజ్యం

author img

By

Published : Jun 19, 2020, 11:50 AM IST

Updated : Jun 19, 2020, 12:35 PM IST

ఆసియాలోనే అతిపెద్ద ధనవంతుడు ముకేశ్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణరహిత కంపెనీల జాబితాలోకి చేరింది. జియోలో 25 శాతం వాటాల విక్రయం ద్వారా రూ. 1.16 లక్షల కోట్లు సమీకరించింది. ఈ డీల్ ద్వారా 2021 మార్చి లోపు సంస్థను రుణరహితంగా మారుస్తానన్న ముకేశ్ అంబానీ.. మరో 9 నెలల కాలం ఉండగానే తన మాటను నిలబెట్టుకున్నారు.

reliance industries
ఇక రుణ రహితంగా అంబానీ సామ్రాజ్యం

ముకేశ్​‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్వర్ణయుగంలోకి ప్రవేశించింది. నికర రుణరహిత సంస్థగా ఆవిర్భవించింది. ''భారత్‌లోనే అత్యంత విలువైన కంపెనీ రుణరహితంగా మారడం అత్యంత అరుదైన విషయం. '2021 మార్చి 31 నాటికి రిలయన్స్‌ను రుణరహిత సంస్థగా చేస్తానని నేను వాటాదారులకు ఇచ్చిన మాట నిలుపుకొన్నాను.' వాటాదారులు, భాగస్వాముల అంచనాలను మించి పనితీరు కనబర్చడం రిలయన్స్‌ డీఎన్‌ఏలోనే ఉంది'' అని శుక్రవారం ఉదయం ముకేశ్​‌ అంబానీ ప్రకటించారు. గత కొన్ని వారాలుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53వేల కోట్లను సమీకరించింది. పెట్టుబడుల రూపంలోనూ జియో డిజిటల్‌ వ్యాపారంలోకి రూ.1.16 లక్షల కోట్లు వచ్చాయి. ఫేస్‌బుక్‌తో డీల్‌ కారణంగా రిలయన్స్‌ వేగంగా తన మాటను నిలబెట్టుకోగలింది.

కార్పొరేట్‌ చరిత్రలో అరుదైన ఘట్టం

రిలయన్స్‌కు రూ.1,61,035 కోట్ల నికర అప్పు ఉండేది. దీనిని 2021 మార్చి 31 నాటికి చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకొంది. దీనికోసం చాలా వేగంగా రైట్స్‌ ఇష్యూస్‌, వాటాల విక్రయం చేపట్టింది. ఈ డీల్స్‌తో రిలయన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త గుర్తింపు వచ్చింది. భారత కార్పొరేట్‌ రంగ చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం. ఒక రకంగా భారత కార్పొరేట్‌ శక్తిని ప్రపంచానికి తెలియజేసినట్టైంది. కరోనావైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌లు విధించిన సమయంలో ఈ డీల్స్‌ జరిగాయి.

అతిపెద్ద రైట్స్ ఇష్యూ ఇదే..

తొలుత రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూను జారీ చేసింది. ఇది భారత కార్పొరేట్‌ చరిత్రలో అతిపెద్దది. ఇది 1.59 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. గత పదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా నాన్‌ ఫైనాన్షియల్‌ సంస్థ జారీ చేసిన అతిపెద్ద రైట్స్‌ ఇష్యూ కూడా ఇదే.

జియోనే కీలకం..

రిలయన్స్‌ జియోలో మొత్తం 24.70శాతం వాటాలను విక్రయించారు. మొత్తం 11 డీల్స్ చేసుకొన్నారు. ఏప్రిల్‌ 22 మొదలు తొమ్మిది వారాల్లో 1,15,693.95 కోట్లను పెట్టుబడుల రూపంలో తీసుకొచ్చారు. ఈ 11 డీల్స్‌ కాకుండా ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న మరో డీల్‌లో 9.99శాతం వాటాను విక్రయించి రూ.43,573.62 కోట్లను తీసుకొచ్చారు. విస్తా, కేకేఆర్‌, సౌదీ అరేబియా పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లతో డీల్స్‌ నుంచి రూ .11,367 కోట్లు లభించాయి.

reliance industries
జియోకు వచ్చిన పెట్టుబడులు

శుక్రవారం ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేర్లు 1.68శాతం పెరిగి రూ.1,684కు చేరాయి. ఇది రిలయన్స్‌ జీవితకాల అత్యధికం. గత కొన్నాళ్లుగా రిలయన్స్‌ షేరు క్రమంగా పెరుగుతూనే ఉంది.

ఇది గర్వకారణం: ముకేశ్​‌ అంబానీ

'రిలయన్స్ ఇండస్ట్రీస్‌ నికర రుణ రహిత సంస్థగా మారడం గర్వకారణం. రిలయన్స్‌‌ స్వర్ణయుగంలో ఉందని నేను చెప్పగలను. సంస్థ వ్యవస్థాపకులైన ధీరూభాయ్‌ అంబానీ కలలను సాకారం చేసేలా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకొంటుంది. భారత వృద్ధిలో నిరంతర భాగస్వామిగా ఉంటుంది' అని ముకేశ్​‌ తెలిపారు.

ఇదీ చూడండి: అంబానీ​ నమ్మిన వ్యూహకర్త.. డీల్స్​​ వెనుక సృష్టికర్త

ముకేశ్​‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్వర్ణయుగంలోకి ప్రవేశించింది. నికర రుణరహిత సంస్థగా ఆవిర్భవించింది. ''భారత్‌లోనే అత్యంత విలువైన కంపెనీ రుణరహితంగా మారడం అత్యంత అరుదైన విషయం. '2021 మార్చి 31 నాటికి రిలయన్స్‌ను రుణరహిత సంస్థగా చేస్తానని నేను వాటాదారులకు ఇచ్చిన మాట నిలుపుకొన్నాను.' వాటాదారులు, భాగస్వాముల అంచనాలను మించి పనితీరు కనబర్చడం రిలయన్స్‌ డీఎన్‌ఏలోనే ఉంది'' అని శుక్రవారం ఉదయం ముకేశ్​‌ అంబానీ ప్రకటించారు. గత కొన్ని వారాలుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53వేల కోట్లను సమీకరించింది. పెట్టుబడుల రూపంలోనూ జియో డిజిటల్‌ వ్యాపారంలోకి రూ.1.16 లక్షల కోట్లు వచ్చాయి. ఫేస్‌బుక్‌తో డీల్‌ కారణంగా రిలయన్స్‌ వేగంగా తన మాటను నిలబెట్టుకోగలింది.

కార్పొరేట్‌ చరిత్రలో అరుదైన ఘట్టం

రిలయన్స్‌కు రూ.1,61,035 కోట్ల నికర అప్పు ఉండేది. దీనిని 2021 మార్చి 31 నాటికి చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకొంది. దీనికోసం చాలా వేగంగా రైట్స్‌ ఇష్యూస్‌, వాటాల విక్రయం చేపట్టింది. ఈ డీల్స్‌తో రిలయన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త గుర్తింపు వచ్చింది. భారత కార్పొరేట్‌ రంగ చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం. ఒక రకంగా భారత కార్పొరేట్‌ శక్తిని ప్రపంచానికి తెలియజేసినట్టైంది. కరోనావైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌లు విధించిన సమయంలో ఈ డీల్స్‌ జరిగాయి.

అతిపెద్ద రైట్స్ ఇష్యూ ఇదే..

తొలుత రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూను జారీ చేసింది. ఇది భారత కార్పొరేట్‌ చరిత్రలో అతిపెద్దది. ఇది 1.59 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. గత పదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా నాన్‌ ఫైనాన్షియల్‌ సంస్థ జారీ చేసిన అతిపెద్ద రైట్స్‌ ఇష్యూ కూడా ఇదే.

జియోనే కీలకం..

రిలయన్స్‌ జియోలో మొత్తం 24.70శాతం వాటాలను విక్రయించారు. మొత్తం 11 డీల్స్ చేసుకొన్నారు. ఏప్రిల్‌ 22 మొదలు తొమ్మిది వారాల్లో 1,15,693.95 కోట్లను పెట్టుబడుల రూపంలో తీసుకొచ్చారు. ఈ 11 డీల్స్‌ కాకుండా ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న మరో డీల్‌లో 9.99శాతం వాటాను విక్రయించి రూ.43,573.62 కోట్లను తీసుకొచ్చారు. విస్తా, కేకేఆర్‌, సౌదీ అరేబియా పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లతో డీల్స్‌ నుంచి రూ .11,367 కోట్లు లభించాయి.

reliance industries
జియోకు వచ్చిన పెట్టుబడులు

శుక్రవారం ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేర్లు 1.68శాతం పెరిగి రూ.1,684కు చేరాయి. ఇది రిలయన్స్‌ జీవితకాల అత్యధికం. గత కొన్నాళ్లుగా రిలయన్స్‌ షేరు క్రమంగా పెరుగుతూనే ఉంది.

ఇది గర్వకారణం: ముకేశ్​‌ అంబానీ

'రిలయన్స్ ఇండస్ట్రీస్‌ నికర రుణ రహిత సంస్థగా మారడం గర్వకారణం. రిలయన్స్‌‌ స్వర్ణయుగంలో ఉందని నేను చెప్పగలను. సంస్థ వ్యవస్థాపకులైన ధీరూభాయ్‌ అంబానీ కలలను సాకారం చేసేలా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకొంటుంది. భారత వృద్ధిలో నిరంతర భాగస్వామిగా ఉంటుంది' అని ముకేశ్​‌ తెలిపారు.

ఇదీ చూడండి: అంబానీ​ నమ్మిన వ్యూహకర్త.. డీల్స్​​ వెనుక సృష్టికర్త

Last Updated : Jun 19, 2020, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.