డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి 24 గంటలు నెఫ్ట్ ద్వారా లావాదేవీలకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విధానం అమలైతే రిటైల్ లావాదేవీల్లో ఇదో విప్లవంగా మారుతుందని రిజర్వు బ్యాంకు భావిస్తోంది.
జాతీయ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్).. ప్రస్తుతం పని దినాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నెలలో రెండు, నాలుగో శనివారాలు నెఫ్ట్కు సెలవు దినాలు.
"డిజిటల్ లావాదేవీల ధ్యేయం 2021"లో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు డిసెంబర్ నుంచి 24x7 ప్రాతిపాదికన నెఫ్ట్ సేవలు అందుబాటులోకి తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది జూన్ నుంచి నెఫ్ట్, ఆర్టీజీస్ చార్జీలను రద్దు చేసింది ఆర్బీఐ. వాటిని వినియోగదారులకు అందించాలని బ్యాంకులకు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ఏడాది కనిష్ఠానికి ఎస్బీఐ వడ్డీ రేట్లు