ETV Bharat / business

మాల్యా వెనుకే నీరవ్​.. 'పరారైన ఆర్థిక నేరగాడి'గా ముద్ర

author img

By

Published : Dec 5, 2019, 1:00 PM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్​ మోదీని.. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా కోర్టు ప్రకటించింది. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ అభ్యర్థన మేరకు ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

PNB scam: Nirav Modi declared as fugitive economic offender
మాల్యా వెనుకే నీరవ్​.. 'పరారైన ఆర్థిక నేరగాడి'గా ముద్ర

వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీని 'పారిపోయిన ఆర్థిక నేరగాడి'గా ప్రకటించింది ముంబయిలోని ప్రత్యేక కోర్టు. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల (ఎఫ్‌ఈవో) చట్టం గతేడాది ఆగస్టులో అమల్లోకి వచ్చాక ఈ ముద్రపడిన రెండో వ్యక్తిగా నీరవ్​ మోదీ నిలిచారు. ఈ జాబితాలో మొదటి వ్యక్తి విజయ్​ మాల్యా.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణంలో ప్రధాన నిందితులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను పరారీ ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించాలని ఈడీ గతంలో పిటిషన్​ దాఖలు చేసింది. విచారించిన కోర్టు ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకుంది.

పంజాబ్​ నేషనల్​ బ్యాంకును నకిలీ 'లెటర్​​ ఆఫ్​ అండర్​టేకింగ్' (ఎల్​ఓయూ)ల​ ద్వారా దాదాపు రూ.14 వేల కోట్లకు మోసగించారు నీరవ్​ మోదీ, మెహుల్​ చోక్సీ.

రూ.100 కోట్లు అంతకుమించి ఆర్థిక మోసాలకు పాల్పడి.. నేర విచారణను తప్పించుకునేందుకు దేశం విడిచి పారిపోయి, తిరిగి వచ్చేందుకు విముఖత చూపేవారిపై అరెస్టు వారెంట్ జారీ అయితే ఎఫ్‌ఈవో చట్టం కింద పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించవచ్చు.

వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీని 'పారిపోయిన ఆర్థిక నేరగాడి'గా ప్రకటించింది ముంబయిలోని ప్రత్యేక కోర్టు. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల (ఎఫ్‌ఈవో) చట్టం గతేడాది ఆగస్టులో అమల్లోకి వచ్చాక ఈ ముద్రపడిన రెండో వ్యక్తిగా నీరవ్​ మోదీ నిలిచారు. ఈ జాబితాలో మొదటి వ్యక్తి విజయ్​ మాల్యా.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణంలో ప్రధాన నిందితులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను పరారీ ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించాలని ఈడీ గతంలో పిటిషన్​ దాఖలు చేసింది. విచారించిన కోర్టు ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకుంది.

పంజాబ్​ నేషనల్​ బ్యాంకును నకిలీ 'లెటర్​​ ఆఫ్​ అండర్​టేకింగ్' (ఎల్​ఓయూ)ల​ ద్వారా దాదాపు రూ.14 వేల కోట్లకు మోసగించారు నీరవ్​ మోదీ, మెహుల్​ చోక్సీ.

రూ.100 కోట్లు అంతకుమించి ఆర్థిక మోసాలకు పాల్పడి.. నేర విచారణను తప్పించుకునేందుకు దేశం విడిచి పారిపోయి, తిరిగి వచ్చేందుకు విముఖత చూపేవారిపై అరెస్టు వారెంట్ జారీ అయితే ఎఫ్‌ఈవో చట్టం కింద పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించవచ్చు.

Lucknow (UP), Dec 05 (ANI): Bahujan Samaj Party (BSP) chief Mayawati during a press conference cleared party's stand on Citizenship Amendment Bill. "Party is against the current form of the Citizenship Amendment Bill (CAB), govt should reconsider aspects of the Bill and it should be sent to parliamentary committee," said Mayawati.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.