ETV Bharat / business

జియో ఎఫెక్ట్​: భారత్​ కోసం 'జూమ్' ప్రత్యేక ప్లాన్ - జూమ్​ యాప్ లేటెస్ట్ న్యూస్

దేశీయంగా పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్​ సరికొత్త ప్రణాళికలు వేస్తోంది. ఇందుకోసం దేశంలో వచ్చే ఐదేళ్లలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులను కూడా భారీగా పెంచుకోనున్నట్లు వెల్లడించింది. ఇటీవలే జూమ్​కు పోటీగా జియో మీట్ అందుబాటులోకి వచ్చింది.

zoom investments in India
భారత్​లో జూమ్ యాప్ పెట్టుబడులు
author img

By

Published : Jul 9, 2020, 5:28 PM IST

ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్​ వచ్చే ఐదేళ్లలో భారత్​లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇదే సమయంలో దేశీయంగా ఉద్యోగుల సంఖ్యను కుడా పెంచుకోనున్నట్లు తెలిపింది.

జూమ్​కు పోటీగా ముకేశ్ అంబానీకి చెందిన జియో మీట్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే జూమ్ ఈ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

జూమ్​కు చైనాతో సంబంధాలు?

జూమ్ యాప్​కు చైనాకు సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలను జూమ్​ ప్రోడక్ట్ అండ్ ఇంజనీరింగ్ అధ్యక్షుడు వెల్చమి శంకర్​లింగం తప్పుబట్టారు. జూమ్ యాప్​ అమెరికా కంపెనీ అని.. అక్కడి స్థానిక స్టాక్ ఎక్స్చేంజి నాస్​డాక్​లో లిస్ట్​ అయిందని గుర్తిచేశారు. చైనాలో తమకు కార్యాలయం ఉందని.. అమెరికా ప్రధాన కార్యాలయం ఆధినంలోనే అది కూడా పని చేస్తున్నట్లు బ్లాగ్​లో వివరించారు.

ఇటీవల 59 చైనా యాప్​లను భారత్​ నిషేధించిన నేపథ్యంలో జూమ్​ యాప్​ కూడా చైనాదేనని.. దానిని నిషేధించాలనే డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో జూమ్ ఈ స్పష్టతనిచ్చింది.

డేటా సెంటర్లు..

జూమ్​ భారతీయ కార్యకలాపాలకు ప్రస్తుతం ముంబయి, హైదరాబాద్​లో డేటా సెంటర్లు ఉన్నట్లు శంకర్​లింగం వెల్లడించారు.

జూమ్​ సంస్థలో తనతో పాటు భారత సంతతికి చెందిన అపర్ణ బవ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్), సునీల్ మధన్​ (కార్పొరేట్ చీఫ్ ఇన్ఫర్మెషన్ ఆఫీసర్) పని చేస్తున్నట్లు తెలిపారు శంకర్​లింగం.

గోప్యత పరంగా జూమ్​ యాప్​పై వచ్చిన అనుమానాలను అర్థం చేసుకున్నన్నామన్నారు శంకర్​లింగం. వీటిని దృష్టిలో ఉంచుకుని యూజర్లు వ్యక్తిగత గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 90 రోజుల్లో 100 ఫీచర్లు తీసుకొచ్చినట్లు వివరించారు.

జూమ్​యాప్​ వినియోగంతో వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఉందని కేంద్ర హోం శాఖ ఏప్రిల్​లో హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించినట్లు జూమ్ వెల్లడించింది.

కరోనాతో 'జూమ్'

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో జూమ్​కు ఆదరణ విపరీతంగా పెరిగింది. అయితే ఇటీవల జూమ్​కు దేశీయంగా జియో మీట్​ ద్వారా పోటీ ఎదురైంది. ఇటీవలే ఆవిష్కరించిన ఈ యాప్ కేవలం వారంలోనే 10 లక్షల డౌన్​లోడ్​లను సాధించింది. జియో మీట్ అపరిమిత వీడియో కాల్స్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది.

అయితే జూమ్ 40 నిమిషాలపాటు మాత్రమే ఉచితంగా వీడియో కాల్స్​కు అవకాశమిస్తోంది.

ఇదీ చూడండి:ఆ పాలసీతో ఉద్యోగం పోయినా ఆర్థిక అండ!

ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్​ వచ్చే ఐదేళ్లలో భారత్​లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇదే సమయంలో దేశీయంగా ఉద్యోగుల సంఖ్యను కుడా పెంచుకోనున్నట్లు తెలిపింది.

జూమ్​కు పోటీగా ముకేశ్ అంబానీకి చెందిన జియో మీట్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే జూమ్ ఈ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

జూమ్​కు చైనాతో సంబంధాలు?

జూమ్ యాప్​కు చైనాకు సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలను జూమ్​ ప్రోడక్ట్ అండ్ ఇంజనీరింగ్ అధ్యక్షుడు వెల్చమి శంకర్​లింగం తప్పుబట్టారు. జూమ్ యాప్​ అమెరికా కంపెనీ అని.. అక్కడి స్థానిక స్టాక్ ఎక్స్చేంజి నాస్​డాక్​లో లిస్ట్​ అయిందని గుర్తిచేశారు. చైనాలో తమకు కార్యాలయం ఉందని.. అమెరికా ప్రధాన కార్యాలయం ఆధినంలోనే అది కూడా పని చేస్తున్నట్లు బ్లాగ్​లో వివరించారు.

ఇటీవల 59 చైనా యాప్​లను భారత్​ నిషేధించిన నేపథ్యంలో జూమ్​ యాప్​ కూడా చైనాదేనని.. దానిని నిషేధించాలనే డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో జూమ్ ఈ స్పష్టతనిచ్చింది.

డేటా సెంటర్లు..

జూమ్​ భారతీయ కార్యకలాపాలకు ప్రస్తుతం ముంబయి, హైదరాబాద్​లో డేటా సెంటర్లు ఉన్నట్లు శంకర్​లింగం వెల్లడించారు.

జూమ్​ సంస్థలో తనతో పాటు భారత సంతతికి చెందిన అపర్ణ బవ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్), సునీల్ మధన్​ (కార్పొరేట్ చీఫ్ ఇన్ఫర్మెషన్ ఆఫీసర్) పని చేస్తున్నట్లు తెలిపారు శంకర్​లింగం.

గోప్యత పరంగా జూమ్​ యాప్​పై వచ్చిన అనుమానాలను అర్థం చేసుకున్నన్నామన్నారు శంకర్​లింగం. వీటిని దృష్టిలో ఉంచుకుని యూజర్లు వ్యక్తిగత గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 90 రోజుల్లో 100 ఫీచర్లు తీసుకొచ్చినట్లు వివరించారు.

జూమ్​యాప్​ వినియోగంతో వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఉందని కేంద్ర హోం శాఖ ఏప్రిల్​లో హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించినట్లు జూమ్ వెల్లడించింది.

కరోనాతో 'జూమ్'

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో జూమ్​కు ఆదరణ విపరీతంగా పెరిగింది. అయితే ఇటీవల జూమ్​కు దేశీయంగా జియో మీట్​ ద్వారా పోటీ ఎదురైంది. ఇటీవలే ఆవిష్కరించిన ఈ యాప్ కేవలం వారంలోనే 10 లక్షల డౌన్​లోడ్​లను సాధించింది. జియో మీట్ అపరిమిత వీడియో కాల్స్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది.

అయితే జూమ్ 40 నిమిషాలపాటు మాత్రమే ఉచితంగా వీడియో కాల్స్​కు అవకాశమిస్తోంది.

ఇదీ చూడండి:ఆ పాలసీతో ఉద్యోగం పోయినా ఆర్థిక అండ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.