ETV Bharat / business

పేటీఎం షాక్‌: వ్యాలెట్​లోకి నగదు బదిలీపై 2% ఛార్జీ!

వినియోగదారులకు పేటీఎం సంస్థ షాకిచ్చింది. క్రెడిట్‌కార్డు ద్వారా వ్యాలెట్‌కు నగదు బదిలీ చేసుకుంటే 2% రుసుము వసూలు చేయనుంది. బ్యాంకులు అధిక ఛార్జీలు వడ్డిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది.

author img

By

Published : Oct 18, 2020, 9:10 AM IST

paytm 2 percent charge
వినియోగదారులకు పేటీఎం షాక్‌.. నగదు బదిలీపై 2% ఛార్జీ

పేటీఎం వినియోగదారులు తమ ఈ-వ్యాలెట్‌లోకి క్రెడిట్‌కార్డుల ద్వారా నగదు వేసుకోవాలంటే ఇకపై 2 శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 10 వేల రూపాయలకు మించి నగదును జమ చేసే వారికి ఈ నిబంధన వర్తించనున్నట్లు సంస్థ తెలిపింది. వినియోగదారులు క్రెడిట్‌కార్డు వినియోగించి వ్యాలెట్‌కు నగదు బదిలీ చేసేందుకు ఆయా బ్యాంకులు.. అధిక ఛార్జీలను విధిస్తుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫలితంగా క్రెడిట్‌కార్డు లావాదేవీలపై 2 శాతం నామినల్‌ ఛార్జీని వసూలు చేస్తున్నట్లు తెలిపింది.

యూపీఐ, డెబిట్‌కార్డుల ద్వారా ఎలాంటి రుసుములు లేకుండా నగదును వ్యాలెట్‌లోకి బదిలీ చేసుకోవచ్చని పేటీఎం సంస్థ వెల్లడించింది. తాజా ఛార్జీలు క్రెడిట్‌కార్డు ద్వారా వ్యాలెట్‌కు నగదు బదిలీ చేసే వారికి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.

పేటీఎం వినియోగదారులు తమ ఈ-వ్యాలెట్‌లోకి క్రెడిట్‌కార్డుల ద్వారా నగదు వేసుకోవాలంటే ఇకపై 2 శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 10 వేల రూపాయలకు మించి నగదును జమ చేసే వారికి ఈ నిబంధన వర్తించనున్నట్లు సంస్థ తెలిపింది. వినియోగదారులు క్రెడిట్‌కార్డు వినియోగించి వ్యాలెట్‌కు నగదు బదిలీ చేసేందుకు ఆయా బ్యాంకులు.. అధిక ఛార్జీలను విధిస్తుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫలితంగా క్రెడిట్‌కార్డు లావాదేవీలపై 2 శాతం నామినల్‌ ఛార్జీని వసూలు చేస్తున్నట్లు తెలిపింది.

యూపీఐ, డెబిట్‌కార్డుల ద్వారా ఎలాంటి రుసుములు లేకుండా నగదును వ్యాలెట్‌లోకి బదిలీ చేసుకోవచ్చని పేటీఎం సంస్థ వెల్లడించింది. తాజా ఛార్జీలు క్రెడిట్‌కార్డు ద్వారా వ్యాలెట్‌కు నగదు బదిలీ చేసే వారికి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.