ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) దేశంలోనే అతిపెద్ద లిస్టెండ్ కంపెనీగా అవతరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ను వెనక్కి నెట్టి ఈ ఘనతను సాధించింది టీసీఎస్.
సోమవారం నాటి లెక్కల ప్రకారం టీసీఎస్ మార్కెట్ క్యాపిటల్ (ఎం-క్యాప్) రూ.12,45,341.44 కోట్లుగా ఉంది. టీసీఎస్ దేశీయ అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా అవతరించడం 2020 మార్చి తర్వాత ఇది రెండో సారి కావడం విశేషం.
సంస్థ షేర్లు దాదాపు 5 శాతం క్షీణించిన కారణంగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం క్యాప్ రూ.12,42,593.78 కోట్లకు తగ్గింది. ఫలితంగా దేశీయ అతి పెద్ద లిస్టెడ్ కంపెనీ రికార్డును కోల్పోయింది.
ఇదీ చూడండి:రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనం