దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ భారత్లో సరికొత్త ఎస్యూవీని ఆవిష్కరించింది. సొనెట్ పేరుతో మార్కెట్లోకి ఈ మోడల్ను శుక్రవారం విడుదల చేసింది.
సొనెట్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ (ఎక్స్ షోరూం) ధర రూ.6.71 లక్షలుగా, గరిష్ఠ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయించింది.
డీజిల్ వేరియంట్ ప్రారంభ(ఎక్స్ షోరూం) ధర రూ.8.05 లక్షలుగా, గరిష్ఠ ధర రూ.10.39 లక్షలుగా నిర్ణయించింది కియా మోటార్స్.
భారత్లోనో ఉత్పత్తవుతున్న సొనెట్ మోడల్ను ఇక్కడి నుంచే 70కి పైగా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కియా మోటార్స్ ఇండియా ఉపాధ్యక్షుడు మనోహర్ భట్ తెలిపారు.
సొనెట్ మోడల్ కోసం ముందస్తు బుకింగ్స్ ద్వారా 25 వేల ఆర్డర్లు అందినట్లు కియా మోటార్స్ తెలిపింది. వారికి ఈ నెల నుంచే డెలివర్ చేయనున్నట్లు వెల్లడించింది.
ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన సొనెట్.. మారుతీ విటారా బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ వంటి మోడళ్లతో పోటీపడే అవకాశం ఉంది.
సొనెట్ ఫీచర్లు..
- ఫోర్ సిలిండర్ ఇంజిన్
- ఫైవ్ ట్రాన్స్ మిషన్ స్పీడ్ ఫీచర్ కలిగిన వైల్డ్ డిజైన్
- ఎలక్ట్రానిక్ బ్రేక్స్ ఫోర్స్ డస్ట్రిబ్యూషన్తో కూడిన యాంటీలాక్ బ్రేకింగ్ వ్యవస్థ
- రిమోట్ ఇంజిన్ స్టార్ట్/ స్టాప్, రిమోట్ ఎయిర్ కాన్ కంట్రోల్స్
- ఆరు ఎయిర్బ్యాగ్లు సహా పలు అధునాతన ఫీచర్లు సొనెట్ మోడల్లో పొందుపరిచింది కియా మోటార్స్.