దేశీయ ఐటీ దిగ్గజం హెచ్సీఎల్టెక్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.3,982 కోట్ల నికర లాభాన్ని గడించినట్లు శుక్రవారం ప్రకటించింది. 2019-20 క్యూ3లో నమోదైన రూ.3,037 కోట్ల లాభంతో పోలిస్తే.. ఇది 31.1 శాతం ఎక్కువ.
2020-21 క్యూ3లో ఆదాయం కూడా 6.4 శాతం పెరిగి..రూ.19,302 కోట్లుగా నమోదైనట్లు హెచ్సీఎల్టెక్ వెల్లడిచింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఆదాయం రూ.18,135 కోట్లుగా ఉన్నట్లు వివరించిది.
క్యూ3లో లాభాలు పెరిగిన నేపథ్యంలో.. చివరి త్రైమాసిక ఆదాయపు అంచనాలను ఎగువకు సవరించింది హెచ్సీఎల్టెక్. జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ ఆదాయం 2% నుంచి 3% వరకు వృద్ధి చెందొచ్చని పేర్కొంది. ఇంతకు ముందు ఈ అంచనాలు 1.5%-2.5 % గా ఉన్నాయి.
ఇదీ చూడండి:ఇక ల్యాండ్లైన్ నుంచి కాల్ చేస్తే '0' తప్పనిసరి