ETV Bharat / business

బ్యాంకింగ్​ రంగ ప్రక్షాళన... ప్రభుత్వ బ్యాంకుల విలీనం

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఉద్దీపన చర్యలు ప్రకటించింది. బ్యాంకింగ్​ రంగంలో ప్రక్షాళన దిశగా అడుగులు వేసినట్లు తెలిపిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కీలక ప్రకటన చేశారు. 4 అతిపెద్ద బ్యాంక్​ విలీనాలను ప్రకటించారు. ఈ రంగాన్ని పటిష్ఠం చేసేందుకు పలు సంస్కరణలు తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు.

author img

By

Published : Aug 30, 2019, 6:32 PM IST

Updated : Sep 28, 2019, 9:23 PM IST

బ్యాంకింగ్​ రంగ ప్రక్షాళన... ప్రభుత్వ బ్యాంకుల విలీనం
బ్యాంకింగ్​ రంగ ప్రక్షాళన... ప్రభుత్వ బ్యాంకుల విలీనం

ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనే దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని కీలక చర్యలు చేపట్టింది. 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యంగా బ్యాంకింగ్​ రంగ ప్రక్షాళనకు పూనుకుంది. ఈ రంగంలో పలు కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై కీలక ప్రకటన చేశారు.

మొత్తం 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను 12కు పరిమితం చేసేలా విలీన ప్రక్రియను ప్రకటించారు.

రెండో అతిపెద్ద బ్యాంకుగా పీఎన్​బీ...

మొదట పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను విలీనం చేయనున్నట్లు తెలిపిన నిర్మలా సీతారామన్‌.. తద్వారా 17.95 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌ ఏర్పడనుందని వివరించారు. సిండికేట్​ బ్యాంక్​ను కెనరా బ్యాంక్​లో విలీనం చేయనున్నారు. యూనియన్‌ బ్యాంక్​లో ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ను విలీనం చేసి దేశంలో ఐదో అతిపెద్ద బ్యాంక్‌గా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇండియన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌ను విలీనం కానున్నట్లు ప్రకటించారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌లు విలీనం అవుతాయి. ఈ విలీనం ద్వారా రూ. 17.95 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌ ఏర్పడనుంది. ఇది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌ విలీనం అవ్వడం వల్ల...రూ. 15.20 లక్షల కోట్ల వ్యాపారంతో నాలుగో అతిపెద్ద బ్యాంక్‌ ఏర్పడనుంది. ఇది కెనరా బ్యాంక్‌ కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌లను విలీనం చేస్తాం. దీనివల్ల రూ.14.59 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే అయిదో అతి పెద్ద బ్యాంక్‌ ఆవిర్భవించనుంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. ఇండియన్‌ బ్యాంకు, అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనం కావడం వల్ల... రూ.8.08 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే ఏడో అతి పెద్ద బ్యాంకు ఏర్పడనుంది.

-నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి

దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకులుగా కొనసాగుతాయన్నారు. ఇండియన్​ ఓవర్​సీస్​ బ్యాంక్​, యూసీఓ బ్యాంక్​, బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర, పంజాబ్​ అండ్​ సింధ్​ బ్యాంక్​లు ఆయా పేర్లతోనే కొనసాగనున్నాయి.

మంచి ఫలితాలు...

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చేపట్టిన సంస్కరణల కారణంగా ఇప్పటికే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపిన నిర్మలా సీతారామన్‌.. 2019-20 తొలి త్రైమాసికంలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలు నమోదు చేసినట్లు తెలిపారు.

బ్యాంకుల వాణిజ్య నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉన్న నిరర్థక ఆస్తులు భారీగా తగ్గాయని పేర్కొన్నారు. డిసెంబర్​తో ముగిసిన 2018-19 మూడో త్రైమాసికంలో 8.65 లక్షల కోట్లుగా ఉన్న మొండి బకాయిలు.. చివరి త్రైమాసికానికి 7.9 లక్షల కోట్లకు తగ్గాయని ప్రకటించారు.

బ్యాంకులు 250 కోట్ల రూపాయలకుపైగా ఇచ్చే రుణాలను పర్యవేక్షించేందుకు.. పారదర్శకత కోసం ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాంకులను మోసగించిన నీరవ్‌ మోదీ వంటివారిని అడ్డుకునేందుకు కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థకు స్విఫ్ట్‌ సందేశాలను అనుసంధానం చేసినట్లు తెలిపారు.

ఆర్థికమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు..

  • 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా చర్యలు.
  • బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలు.
  • గృహ, వాహనాల, తనఖా రుణాలను ప్రారంభించిన 8 ప్రభుత్వ రంగ బ్యాంకులు.
  • సుపరిపాలన దిశగా బ్యాంకులు తమ సేవల్లో మార్పులు చేసుకోవాలి.
  • రుణాల నిర్వహణను బ్యాంకులు సమీక్షిస్తున్నాయి.
  • రుణాల రికవరీలో బ్యాంకులు పురోగతి సాధించాయి.
  • 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయి
  • నీరవ్‌ మోదీ లాంటి ఉదంతాలు మరోసారి జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం.
  • రూ. 250 కోట్ల కంటే ఎక్కువ రుణాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేస్తున్నాం.

బ్యాంకింగ్​ రంగ ప్రక్షాళన... ప్రభుత్వ బ్యాంకుల విలీనం

ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనే దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని కీలక చర్యలు చేపట్టింది. 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యంగా బ్యాంకింగ్​ రంగ ప్రక్షాళనకు పూనుకుంది. ఈ రంగంలో పలు కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై కీలక ప్రకటన చేశారు.

మొత్తం 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను 12కు పరిమితం చేసేలా విలీన ప్రక్రియను ప్రకటించారు.

రెండో అతిపెద్ద బ్యాంకుగా పీఎన్​బీ...

మొదట పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను విలీనం చేయనున్నట్లు తెలిపిన నిర్మలా సీతారామన్‌.. తద్వారా 17.95 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌ ఏర్పడనుందని వివరించారు. సిండికేట్​ బ్యాంక్​ను కెనరా బ్యాంక్​లో విలీనం చేయనున్నారు. యూనియన్‌ బ్యాంక్​లో ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ను విలీనం చేసి దేశంలో ఐదో అతిపెద్ద బ్యాంక్‌గా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇండియన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌ను విలీనం కానున్నట్లు ప్రకటించారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌లు విలీనం అవుతాయి. ఈ విలీనం ద్వారా రూ. 17.95 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌ ఏర్పడనుంది. ఇది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌ విలీనం అవ్వడం వల్ల...రూ. 15.20 లక్షల కోట్ల వ్యాపారంతో నాలుగో అతిపెద్ద బ్యాంక్‌ ఏర్పడనుంది. ఇది కెనరా బ్యాంక్‌ కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌లను విలీనం చేస్తాం. దీనివల్ల రూ.14.59 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే అయిదో అతి పెద్ద బ్యాంక్‌ ఆవిర్భవించనుంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. ఇండియన్‌ బ్యాంకు, అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనం కావడం వల్ల... రూ.8.08 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే ఏడో అతి పెద్ద బ్యాంకు ఏర్పడనుంది.

-నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి

దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకులుగా కొనసాగుతాయన్నారు. ఇండియన్​ ఓవర్​సీస్​ బ్యాంక్​, యూసీఓ బ్యాంక్​, బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర, పంజాబ్​ అండ్​ సింధ్​ బ్యాంక్​లు ఆయా పేర్లతోనే కొనసాగనున్నాయి.

మంచి ఫలితాలు...

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చేపట్టిన సంస్కరణల కారణంగా ఇప్పటికే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపిన నిర్మలా సీతారామన్‌.. 2019-20 తొలి త్రైమాసికంలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలు నమోదు చేసినట్లు తెలిపారు.

బ్యాంకుల వాణిజ్య నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉన్న నిరర్థక ఆస్తులు భారీగా తగ్గాయని పేర్కొన్నారు. డిసెంబర్​తో ముగిసిన 2018-19 మూడో త్రైమాసికంలో 8.65 లక్షల కోట్లుగా ఉన్న మొండి బకాయిలు.. చివరి త్రైమాసికానికి 7.9 లక్షల కోట్లకు తగ్గాయని ప్రకటించారు.

బ్యాంకులు 250 కోట్ల రూపాయలకుపైగా ఇచ్చే రుణాలను పర్యవేక్షించేందుకు.. పారదర్శకత కోసం ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాంకులను మోసగించిన నీరవ్‌ మోదీ వంటివారిని అడ్డుకునేందుకు కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థకు స్విఫ్ట్‌ సందేశాలను అనుసంధానం చేసినట్లు తెలిపారు.

ఆర్థికమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు..

  • 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా చర్యలు.
  • బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలు.
  • గృహ, వాహనాల, తనఖా రుణాలను ప్రారంభించిన 8 ప్రభుత్వ రంగ బ్యాంకులు.
  • సుపరిపాలన దిశగా బ్యాంకులు తమ సేవల్లో మార్పులు చేసుకోవాలి.
  • రుణాల నిర్వహణను బ్యాంకులు సమీక్షిస్తున్నాయి.
  • రుణాల రికవరీలో బ్యాంకులు పురోగతి సాధించాయి.
  • 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయి
  • నీరవ్‌ మోదీ లాంటి ఉదంతాలు మరోసారి జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం.
  • రూ. 250 కోట్ల కంటే ఎక్కువ రుణాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేస్తున్నాం.
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
HOST BROADCASTER - AP CLIENTS ONLY
Helsinki - 30 August 2019
1. Arrival of North Macedonia Foreign Minister Nikola Dimitrov
2. SOUNDBITE (English) Nikola Dimitrov, North Macedonia Foreign Minister:
"I'm here to continue to explain that for a sustainable Balkans, we need the European future. And together with the Finnish Presidency we can make one step in that direction in October 15 for North Macedonia to start that journey."
3. Cutaway
4. SOUNDBITE (English) Nikola Dimitrov, North Macedonia Foreign Minister:
"I don't think we should talk about enlargement, we should talk about completion, because the region is fully surrounded by member states. In a few years, once we are ready and we join, the map of Europe will stay the same, it won't enlarge. So it's completion. If we do this right, we can all gain from it: member states and candidate countries. What President Macron is fighting for within the EU is what we do in our region, we're fighting for the same values."
5. Various of Dimitrov entering Finlandia hall and being greeted
6. Various of arrival of Srdan Darmanovic, Foreign Minister of Montenegro
7. Various of arrival of Ivica Dacic, Foreign Minister of Serbia
8. Various of arrival of Gent Cakaj, Deputy Foreign Minister of Albania
9. Various of arrival of Behgjet Pacolli, Foreign Minister of Kosovo
10. Various of arrivals of Igor Crnadak, Foreign Minister of Bosnia
11. Various of ministers in meeting room ahead of session
STORYLINE:
North Macedonia said Friday it was intent on joining the European Union, insisting it would be good for the EU as a whole.
The country's foreign minister, Nikola Dimitrov, made the comments at an informal meeting of EU foreign ministers in Helsinki.
EU membership should be seen as a step towards completing the EU project in the region, and that if done well, both North Macedonia and the EU would benefit, Dimitrov said.
The EU ministers are meeting with their counterparts from the Balkans to discuss closer links between the EU and Balkan countries.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.