దేశంలో గత కొన్ని త్రైమాసికాల్లో ఆర్థిక పరిస్థితులు, వ్యాపార వాతావరణం ప్రతికూలంగా మారినట్లు ఓ నివేదిక వెల్లడించింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసర్చ్ (ఎన్సీఏఈఆర్) చేసిన ఈ సర్వేలో దేశ వ్యాపార విశ్వాసంపై పలు కీలక విషయాలు వెల్లడించింది. 600 భారతీయ కంపెనీలపై జరిపిన సర్వే ఆధారంగా నివేదికను రూపొందించింది.
ఈ ఏడాది మే-జులై మూడు నెలలతో పోలిస్తే.. ఆగస్టు-అక్టోబర్ త్రైమాసికంలో బిజినెస్ కాన్ఫిడెన్స్ సూచీ 15.3 శాతం తగ్గినట్లు పేర్కొంది. 2019-20 రెండో త్రైమాసికంలో ఈ సూచీ 103.1 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
గత ఏడాది ఆగస్టు-అక్టోబర్ త్రైమాసికంతో పోలిస్తే.. ఈ ఏడాది అదే సమయంలో బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 22.5 శాతం క్షీణించినట్లు నివేదిక పేర్కొంది.
నివేదికలో పేర్కొన్న కీలక విషయాలు..
- రానున్న ఆరు నెలల్లో దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడొచ్చు
- కంపెనీల ఆర్థిక స్థితి ఆరు నెలల్లో పుంజుకుంటుంది
- పెట్టుబడులు ప్రస్తుతం సానుకూలంగా ఉన్నాయి
ఇదీ చూడండి: ఇన్ఫోసిస్పై మరో లేఖాస్త్రం.. సీఈఓనే లక్ష్యం..!