ETV Bharat / business

'ఎతిహాద్​' నష్టం 1.7 బిలియన్​ డాలర్లు - ఎతిహాత్​ ఎయిర్​వేస్​ 2020 ఆదాయం

ప్రముఖ విమానయాన సంస్థ 'ఎతిహాద్ ఎయిర్​వేస్​​' 2020లో రికార్డు స్థాయిలో 1.7 బిలియన్​ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకుంది. కరోనాతో తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో విమానయానం ప్రధానంగా ఉందనే విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Etihad Airways latest news
కరోనా దెబ్బకు ఎతిహాద్ ఎయిర్​వేస్​కు భారీ నష్టాలు
author img

By

Published : Mar 4, 2021, 8:17 PM IST

అబుదాబి జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్​వేస్​​ 2020లో 1.7 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసినట్లు గురువారం ప్రకటించింది. కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్న ఎదుర్కొంటున్న సంస్థకు, కరోనా సంక్షోభం తోడవ్వడం వల్ల ఈ స్థాయి నష్టాలు నమోదైనట్లు తెలుస్తోంది.

2019తో పోలిస్తే గత ఏడాది సంస్థ ఆదాయం 5.6 బిలియన్ డాలర్ల నుంచి 2.7 బిలియన్​ డాలర్లకు తగ్గినట్లు ఎతిహాద్ ఎయిర్​వేస్​ వెల్లడించింది.

2016 నుంచి ఎతిహాద్​ 5.62 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఐరోపా నుంచి ఆసియా వరకు స్థానిక విమానయాన సంస్థలకు పోటీ ఇవ్వడమే (ముఖ్యంగా దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ఎమిరేట్స్​, ఖతార్​ ఎయిర్​వేస్​లకు పోటీ ఇచ్చేందుకు) లక్ష్యంగా దూకుడుగా ఇతర విమాన సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ఇందుకు ప్రధాన కారణం.

2020లో సంస్థ పరిస్థితి..

  • కరోనా కారణంగా గత ఏడాది మార్చిలో ప్యాసింజర్​ ట్రాఫిక్ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 17.5 మిలియన్ల నుంచి 4.2 మిలియన్లకు తగ్గింది.
  • 2020 ప్రథమార్ధంలో ప్యాసింజర్​ కెపాసిటీ 64 శాతం తగ్గింది. దీనితో మొదటి ఆరు నెలల్లో సంస్థ 758 మిలియన్​ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకుంది.
  • నష్టాలను తగ్గించుకునేందుకు సంస్థ సిబ్బందిలో 33 శాతం తగ్గించుకుంది. మిగతా సిబ్బంది వేతనాల్లోనూ 25-50 శాతం వరకు కోత విధించింది. అయినప్పటికీ భారీ నష్టాల నుంచి తప్పించుకోలేకపోయింది.
  • ఎతిహాద్​ సంస్థ 2019లో 870 మిలియన్ డాలర్లు, 2018లో 1.28 బిలియన్ డాలర్లు, 2017లో 1.52 బిలియన్​ డాలర్ల నష్టాలన్ని నమోదు చేసింది.

ఇదీ చదవండి:ఆటో రిక్షాతో 'మొబైల్​ హౌస్'​.. మహీంద్రా ఫిదా

అబుదాబి జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్​వేస్​​ 2020లో 1.7 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసినట్లు గురువారం ప్రకటించింది. కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్న ఎదుర్కొంటున్న సంస్థకు, కరోనా సంక్షోభం తోడవ్వడం వల్ల ఈ స్థాయి నష్టాలు నమోదైనట్లు తెలుస్తోంది.

2019తో పోలిస్తే గత ఏడాది సంస్థ ఆదాయం 5.6 బిలియన్ డాలర్ల నుంచి 2.7 బిలియన్​ డాలర్లకు తగ్గినట్లు ఎతిహాద్ ఎయిర్​వేస్​ వెల్లడించింది.

2016 నుంచి ఎతిహాద్​ 5.62 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఐరోపా నుంచి ఆసియా వరకు స్థానిక విమానయాన సంస్థలకు పోటీ ఇవ్వడమే (ముఖ్యంగా దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ఎమిరేట్స్​, ఖతార్​ ఎయిర్​వేస్​లకు పోటీ ఇచ్చేందుకు) లక్ష్యంగా దూకుడుగా ఇతర విమాన సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ఇందుకు ప్రధాన కారణం.

2020లో సంస్థ పరిస్థితి..

  • కరోనా కారణంగా గత ఏడాది మార్చిలో ప్యాసింజర్​ ట్రాఫిక్ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 17.5 మిలియన్ల నుంచి 4.2 మిలియన్లకు తగ్గింది.
  • 2020 ప్రథమార్ధంలో ప్యాసింజర్​ కెపాసిటీ 64 శాతం తగ్గింది. దీనితో మొదటి ఆరు నెలల్లో సంస్థ 758 మిలియన్​ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకుంది.
  • నష్టాలను తగ్గించుకునేందుకు సంస్థ సిబ్బందిలో 33 శాతం తగ్గించుకుంది. మిగతా సిబ్బంది వేతనాల్లోనూ 25-50 శాతం వరకు కోత విధించింది. అయినప్పటికీ భారీ నష్టాల నుంచి తప్పించుకోలేకపోయింది.
  • ఎతిహాద్​ సంస్థ 2019లో 870 మిలియన్ డాలర్లు, 2018లో 1.28 బిలియన్ డాలర్లు, 2017లో 1.52 బిలియన్​ డాలర్ల నష్టాలన్ని నమోదు చేసింది.

ఇదీ చదవండి:ఆటో రిక్షాతో 'మొబైల్​ హౌస్'​.. మహీంద్రా ఫిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.