ETV Bharat / business

ఎలక్ట్రిక్​ కార్ల తయారీలోకి షియోమి! - బ్లూమ్​బర్గ్

చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ కంపెనీ షియోమి త్వరలోనే ఎలక్ట్రిక్​ వాహనాల(ఈవీ) తయారీలోకి అడుగుపెట్టనుంది. ఈ రంగంలోని అపార అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 'ఈవీ' పూర్తిగా కొత్త విభాగం అయినప్పటికీ.. మార్కెట్​ వాటాను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ లీ-జున్ ప్రకటించారు.

Xiaomi plans to plow $10 billion into electric cars
ఎలక్ట్రిక్​ కార్ల తయారీలోకి షియోమి ఎంట్రీ!
author img

By

Published : Apr 1, 2021, 1:40 PM IST

చైనా స్మార్ట్​ఫోన్​​ దిగ్గజం షియోమి ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించనుంది. వచ్చే పదేళ్లలో ఈ విభాగంపై సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ లీ జున్ ప్రకటించారు.

చైనాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్(ఈవీ) మార్కెట్లో ప్రవేశించేందుకు తీసుకున్న నిర్ణయం అతిపెద్ద మలుపు అని కంపెనీ భావిస్తోంది. ఈ ప్రకటనతో హాకాంగ్​ సూచీలో షేరు షియోమి షేరు ధర ఆరు శాతానికి పైగా ఎగసింది.

వచ్చే మూడేళ్లలో మొత్తం 100 బిలియన్ యువాన్లను పెట్టుబడి పెట్టనున్నట్లు షియోమి ప్రకటించింది. దీనిలో 60% కంపెనీ సమకూరుస్తామని.. మిగతా నిధులను బయటినుంచి సేకరించాలనే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే తమ కార్లలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు ఇంజినీర్లను సైతం షియోమి నియమించుకుంది. భవిష్యత్​లో కార్లు మరింత అటానమస్​గా(స్వయంచాలకంగా) ఉంటాయని భావిస్తోంది షియోమి.

''కార్ల తయారీ పరిశ్రమ గురించి మాకు పూర్తి అవగాహన ఉంది. ప్రపంచంలో విస్తృత మార్కెట్​ ఉన్న 'ఈవీ' విభాగంలో చోటు సంపాదించేందుకు ప్రయత్నిస్తాం. సెర్చ్ ఇంజిన్​ దిగ్గజం 'బైడు' వంటి కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ కార్ల నిర్మాణానికి సమాయత్తమవుతోన్న అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. నూతన విభాగమైన ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ ఉత్పత్తిలోకి ప్రవేశమనేది నా చివరి ప్రయత్నం. ఇదే నా చివరి అంకుర పరిశ్రమ కూడా.​''

-లీ జున్, షియోమి సీఈఓ

ఇక చైనా ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి షియోమి ప్రవేశంతో ఈ విభాగంలో వృద్ధి నమోదవ్వచ్చని బ్లూమ్​బర్గ్ అంచనా వేసింది. మొబైల్​ఫోన్ల అసెంబ్లింగ్​ మాదిరే ఎలక్ట్రిక్​ కార్ల​నూ కాంట్రాక్ట్ పద్దతిలో ఉత్పత్తి చేసే అవుట్​సోర్సింగ్ కంపెనీలకు ఇవ్వొచ్చని అభిప్రాయపడింది. అయితే ఈ వాదనను కంపెనీ తిరస్కరించింది. తాము ఏ కంపెనీతోనూ జట్టుకట్టేది లేదని స్పష్టం చేసింది.

దశాబ్దం క్రితం లీ స్థాపించిన షియోమి.. చైనాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా అవతరించింది. మొబైల్ పరికరాలతో పాటు.. ఇంటర్నెట్ సేవలు, రైస్ కుక్కర్లు, రోబో-వాక్యూమ్‌ క్లీనర్​ల వంటి హోమ్ గాడ్జెట్‌లను ఉత్పత్తిలోనూ ప్రసిద్ది చెందింది.

ఇవీ చదవండి: 2636 ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్​సిగ్నల్​

2030 నాటికి ఈవీల అమ్మకాలు గణనీయం..!

భారత రోడ్లపై త్వరలోనే విద్యుత్​ కార్ల జోరు!

2021లో హవా అంతా ఎలక్ట్రిక్​ కార్లదే!

చైనా స్మార్ట్​ఫోన్​​ దిగ్గజం షియోమి ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించనుంది. వచ్చే పదేళ్లలో ఈ విభాగంపై సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ లీ జున్ ప్రకటించారు.

చైనాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్(ఈవీ) మార్కెట్లో ప్రవేశించేందుకు తీసుకున్న నిర్ణయం అతిపెద్ద మలుపు అని కంపెనీ భావిస్తోంది. ఈ ప్రకటనతో హాకాంగ్​ సూచీలో షేరు షియోమి షేరు ధర ఆరు శాతానికి పైగా ఎగసింది.

వచ్చే మూడేళ్లలో మొత్తం 100 బిలియన్ యువాన్లను పెట్టుబడి పెట్టనున్నట్లు షియోమి ప్రకటించింది. దీనిలో 60% కంపెనీ సమకూరుస్తామని.. మిగతా నిధులను బయటినుంచి సేకరించాలనే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే తమ కార్లలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు ఇంజినీర్లను సైతం షియోమి నియమించుకుంది. భవిష్యత్​లో కార్లు మరింత అటానమస్​గా(స్వయంచాలకంగా) ఉంటాయని భావిస్తోంది షియోమి.

''కార్ల తయారీ పరిశ్రమ గురించి మాకు పూర్తి అవగాహన ఉంది. ప్రపంచంలో విస్తృత మార్కెట్​ ఉన్న 'ఈవీ' విభాగంలో చోటు సంపాదించేందుకు ప్రయత్నిస్తాం. సెర్చ్ ఇంజిన్​ దిగ్గజం 'బైడు' వంటి కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ కార్ల నిర్మాణానికి సమాయత్తమవుతోన్న అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. నూతన విభాగమైన ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ ఉత్పత్తిలోకి ప్రవేశమనేది నా చివరి ప్రయత్నం. ఇదే నా చివరి అంకుర పరిశ్రమ కూడా.​''

-లీ జున్, షియోమి సీఈఓ

ఇక చైనా ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి షియోమి ప్రవేశంతో ఈ విభాగంలో వృద్ధి నమోదవ్వచ్చని బ్లూమ్​బర్గ్ అంచనా వేసింది. మొబైల్​ఫోన్ల అసెంబ్లింగ్​ మాదిరే ఎలక్ట్రిక్​ కార్ల​నూ కాంట్రాక్ట్ పద్దతిలో ఉత్పత్తి చేసే అవుట్​సోర్సింగ్ కంపెనీలకు ఇవ్వొచ్చని అభిప్రాయపడింది. అయితే ఈ వాదనను కంపెనీ తిరస్కరించింది. తాము ఏ కంపెనీతోనూ జట్టుకట్టేది లేదని స్పష్టం చేసింది.

దశాబ్దం క్రితం లీ స్థాపించిన షియోమి.. చైనాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా అవతరించింది. మొబైల్ పరికరాలతో పాటు.. ఇంటర్నెట్ సేవలు, రైస్ కుక్కర్లు, రోబో-వాక్యూమ్‌ క్లీనర్​ల వంటి హోమ్ గాడ్జెట్‌లను ఉత్పత్తిలోనూ ప్రసిద్ది చెందింది.

ఇవీ చదవండి: 2636 ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్​సిగ్నల్​

2030 నాటికి ఈవీల అమ్మకాలు గణనీయం..!

భారత రోడ్లపై త్వరలోనే విద్యుత్​ కార్ల జోరు!

2021లో హవా అంతా ఎలక్ట్రిక్​ కార్లదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.