ETV Bharat / business

లాభాల స్వీకరణతో ఫ్లాట్​గా స్టాక్​ మార్కెట్లు

author img

By

Published : Sep 11, 2020, 9:27 AM IST

Updated : Sep 11, 2020, 10:39 AM IST

stock market news today
నేటి స్టాక్ మార్కెట్లు

10:20 September 11

లాభనష్టాల మధ్య ఊగిసలాట..

స్టాక్ మార్కెట్లు లాభానష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. సానుకూలంగా ప్రారంభమైన కొద్ది సేపటికే మదుపరుల లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 38,841 వద్ద, నిఫ్టీ 11,451 వద్ద ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం సెషన్​లో భారీగా కుదేలవ్వడం కూడా దేశీయ సూచీల ఒడుదొడుకులకు కారణంగా తెలుస్తోంది.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన టోక్యో, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ఉన్నాయి. షాంఘై, సియోల్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.45 శాతం తగ్గింది. బ్యారెల్ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్​లో 39.88 డాలర్లకు దిగొచ్చింది.

టైటాన్, టీసీఎస్​, టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్​యూఎల్​ లాభాల్లో ఉన్నాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, పవర్​గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:02 September 11

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​లో లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 70 పాయింట్లకుపైగా పుంజుకుని 38,915 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ స్వల్పంగా 20 పాయింట్లకుపైగా లాభంతో 11,475 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి. ఇటీవలి భారీ లాభాల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఎస్​బీఐ, టైటాన్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్​ భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

గురువారం రికార్డు స్థాయిలో పుంజుకున్న రిలయన్స్ షేర్లు శుక్రవారం అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఓఎన్​జీసీ, హెచ్​సీఎల్​టెక్, నెస్లే, ఏషియన్​ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

10:20 September 11

లాభనష్టాల మధ్య ఊగిసలాట..

స్టాక్ మార్కెట్లు లాభానష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. సానుకూలంగా ప్రారంభమైన కొద్ది సేపటికే మదుపరుల లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 38,841 వద్ద, నిఫ్టీ 11,451 వద్ద ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం సెషన్​లో భారీగా కుదేలవ్వడం కూడా దేశీయ సూచీల ఒడుదొడుకులకు కారణంగా తెలుస్తోంది.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన టోక్యో, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ఉన్నాయి. షాంఘై, సియోల్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.45 శాతం తగ్గింది. బ్యారెల్ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్​లో 39.88 డాలర్లకు దిగొచ్చింది.

టైటాన్, టీసీఎస్​, టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్​యూఎల్​ లాభాల్లో ఉన్నాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, పవర్​గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:02 September 11

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​లో లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 70 పాయింట్లకుపైగా పుంజుకుని 38,915 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ స్వల్పంగా 20 పాయింట్లకుపైగా లాభంతో 11,475 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి. ఇటీవలి భారీ లాభాల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఎస్​బీఐ, టైటాన్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్​ భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

గురువారం రికార్డు స్థాయిలో పుంజుకున్న రిలయన్స్ షేర్లు శుక్రవారం అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఓఎన్​జీసీ, హెచ్​సీఎల్​టెక్, నెస్లే, ఏషియన్​ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Sep 11, 2020, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.