ETV Bharat / business

బ్యాంకింగ్ షేర్ల అండతో మార్కెట్లలో జోష్​

author img

By

Published : May 28, 2020, 3:40 PM IST

Updated : May 28, 2020, 4:36 PM IST

బ్యాంకింగ్ రంగం అండతో ఇవాళ దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూలతలు కూడా ఇందుకు దోహదం చేశాయి. సెన్సెక్స్ 595 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్ల మేర లాభపడ్డాయి.

stock market closes green
లాభాలతో ముగిసిన స్టాక్​మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు రాణించడం దీనికి కలిసొచ్చింది.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 595 పాయింట్లు లాభపడి 32 వేల 200 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 171 పాయింట్లు వృద్ధిచెంది 9 వేల 485 వద్ద స్థిరపడింది.

ఫ్యూచర్స్, డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియడం కూడా ఇవాళ దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. అయితే కరోనా కేసులు పెరగడం, ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుండడం వల్ల మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

లాభనష్టాల్లో

ఎల్​ అండ్ టీ, హీరో మోటోకార్ప్, ఇండస్​ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, రిలయన్స్ రాణించాయి.

ఐటీసీ, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్​, విప్రో, సిప్లా, బీపీసీఎల్​ నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

షాంఘై, టోక్యో మార్కెట్లు లాభాలతో ముగియగా... హాంకాంగ్, సియోల్ నష్టపోయాయి. మరోవైపు యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.92 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 34.92 డాలర్లుగా ఉంది.

రూపాయి

రూపాయి విలువ 5 పైసలు తగ్గి, ఒక డాలరుకు రూ.75.76గా ఉంది.

ఇదీ చూడండి: భారత వృద్ధిరేటు 5 శాతం క్షీణిస్తుంది: ఎస్​ అండ్ పీ

అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు రాణించడం దీనికి కలిసొచ్చింది.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 595 పాయింట్లు లాభపడి 32 వేల 200 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 171 పాయింట్లు వృద్ధిచెంది 9 వేల 485 వద్ద స్థిరపడింది.

ఫ్యూచర్స్, డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియడం కూడా ఇవాళ దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. అయితే కరోనా కేసులు పెరగడం, ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుండడం వల్ల మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

లాభనష్టాల్లో

ఎల్​ అండ్ టీ, హీరో మోటోకార్ప్, ఇండస్​ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, రిలయన్స్ రాణించాయి.

ఐటీసీ, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్​, విప్రో, సిప్లా, బీపీసీఎల్​ నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

షాంఘై, టోక్యో మార్కెట్లు లాభాలతో ముగియగా... హాంకాంగ్, సియోల్ నష్టపోయాయి. మరోవైపు యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.92 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 34.92 డాలర్లుగా ఉంది.

రూపాయి

రూపాయి విలువ 5 పైసలు తగ్గి, ఒక డాలరుకు రూ.75.76గా ఉంది.

ఇదీ చూడండి: భారత వృద్ధిరేటు 5 శాతం క్షీణిస్తుంది: ఎస్​ అండ్ పీ

Last Updated : May 28, 2020, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.