ETV Bharat / business

మార్కెట్లోకి త్వరలో కొత్త ఈ-స్కూటర్​- ధర, ఫీచర్లు ఇవే..

author img

By

Published : Jul 6, 2021, 12:24 PM IST

భారత మార్కెట్లోకి మరో విద్యుత్​ ద్విచక్ర వాహనం అందుబాటులోకి రానుంది. బెంగళూరుకు చెందిన 'సింపుల్ ఎనర్జీ' అనే అంకుర సంస్థ ఈ కొత్త స్కూటర్​ను విడుదల చేయనుంది. వచ్చే నెల మార్కెట్లోకి రానున్న ఈ కొత్త స్కూటర్​ ధర, ఇతర ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Simple one E Scooter
సింపుల్​ వన్​ స్కూటర్​

బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న విద్యుత్ వాహనాల స్టార్టప్​.. 'సింపుల్​ ఎనర్జీ' తొలి ఈ-స్కూటర్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 15న 'సింపుల్ వన్​' పేరుతో తమ స్కూటర్​ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

ఈ కొత్త స్కూటర్​ దశల వారీగా వివిధ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. తొలుత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్​లలో.. ఆ తర్వాత ఇతర నగరాల్లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫ్రెంచ్​ టెక్నాలజీ దిగ్గజం డసో సిస్టమ్స్​ ద్వారా తమ స్కూటర్​ను డిజైన్​ చేసినట్లు సింపుల్​ ఎనర్జీ తెలిపింది. ఈ స్కూటర్​ ధర వివరాలు అధికారికంగా తెలియనప్పటికీ.. రూ.1.10 లక్షల నుంచి రూ.1.20 లక్షల మధ్య ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.

బెంగళూరులోని వైట్​ఫీల్డ్​లో ఉన్న ఫ్యాక్టరీలో సింపుల్​ వన్​ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది సింపుల్​ ఎనర్జీ. ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం 50 వేల యూనిట్లు.

సింపుల్ వన్​ ఫీచర్లు..

  • ఒక్క సారి ఛార్జ్​ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించే వీలు
  • 0 నుంచి 50 కిలో మీటర్ల వేగాన్ని 3.6 సెకన్లలోనే అందుకునే సామర్థ్యం
  • గరిష్ఠ వేగం గంటకు 100 కిలో మీటర్లు
  • మిడ్​ డ్రైవ్​ మోటార్​, రిమూవబుల్ బ్యాటరీ
  • బ్లూటూత్​, నావిగేషన్​ కనెక్టివిటీ

ఇదీ చదవండి:జొమాటో ఐపీఓకు సెబీ అనుమతి- త్వరలోనే మార్కెట్లోకి!

బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న విద్యుత్ వాహనాల స్టార్టప్​.. 'సింపుల్​ ఎనర్జీ' తొలి ఈ-స్కూటర్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 15న 'సింపుల్ వన్​' పేరుతో తమ స్కూటర్​ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

ఈ కొత్త స్కూటర్​ దశల వారీగా వివిధ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. తొలుత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్​లలో.. ఆ తర్వాత ఇతర నగరాల్లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫ్రెంచ్​ టెక్నాలజీ దిగ్గజం డసో సిస్టమ్స్​ ద్వారా తమ స్కూటర్​ను డిజైన్​ చేసినట్లు సింపుల్​ ఎనర్జీ తెలిపింది. ఈ స్కూటర్​ ధర వివరాలు అధికారికంగా తెలియనప్పటికీ.. రూ.1.10 లక్షల నుంచి రూ.1.20 లక్షల మధ్య ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.

బెంగళూరులోని వైట్​ఫీల్డ్​లో ఉన్న ఫ్యాక్టరీలో సింపుల్​ వన్​ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది సింపుల్​ ఎనర్జీ. ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం 50 వేల యూనిట్లు.

సింపుల్ వన్​ ఫీచర్లు..

  • ఒక్క సారి ఛార్జ్​ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించే వీలు
  • 0 నుంచి 50 కిలో మీటర్ల వేగాన్ని 3.6 సెకన్లలోనే అందుకునే సామర్థ్యం
  • గరిష్ఠ వేగం గంటకు 100 కిలో మీటర్లు
  • మిడ్​ డ్రైవ్​ మోటార్​, రిమూవబుల్ బ్యాటరీ
  • బ్లూటూత్​, నావిగేషన్​ కనెక్టివిటీ

ఇదీ చదవండి:జొమాటో ఐపీఓకు సెబీ అనుమతి- త్వరలోనే మార్కెట్లోకి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.