ETV Bharat / business

కరోనా భయాలున్నా దలాల్ స్ట్రీట్​లో జోష్​

బ్యాంకింగ్​, ఐటీ, ఆటో రంగాల్లో కొనుగోళ్లు మార్కెట్లకు ఊతమిచ్చాయి. దేశీయ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 1100 పాయింట్లకుపైగా పెరిగింది. నిఫ్టీ 8 వేల 400 మార్కును అధిగమించింది.

author img

By

Published : Apr 7, 2020, 11:20 AM IST

Updated : Apr 7, 2020, 12:29 PM IST

Sensex rallies over 1,300 pts; Nifty reclaims 8,400
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో మార్కెట్లలో జోష్​

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు ఇవాళ లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్​, ఐటీ, ఆటో రంగాల్లో కొనుగోళ్లు జరగడమూ లాభాలకు మరో కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఆరంభంలో 1300 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం 1245 పాయింట్ల లాభంతో 28,836 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 8 వేల 400 మార్కు దాటింది. 353 పాయింట్లు పెరిగి 8,437 వద్ద కొనసాగుతోంది.

శుక్రవారం నాటి ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 674, నిఫ్టీ 170 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

లాభనష్టాల్లో...

ఇండస్​ఇండ్​ బ్యాంకు సెన్సెక్స్​ ప్యాక్​లో ఉత్తమ లాభాలు నమోదుచేసింది. దాదాపు 15 శాతం పెరిగింది. మహీంద్రా అండ్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఇన్ఫోసిస్​ రాణించాయి.

బజాజ్​ ఫినాన్స్​ భారీగా నష్టపోయింది. ఐటీసీ, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఐషర్​ మోటార్స్​ కూడా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

ఇతర మార్కెట్లు...

ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంగ్​కాంగ్​, టోక్యో, సియోల్​లు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు కూడా సోమవారం లాభాల్లోనే ముగిశాయి.

ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు 2 శాతం మేర పెరిగి.. బ్యారెల్​కు 33.93 డాలర్ల వద్ద ఉంది.

రూపాయి..

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి 21 పైసలు పెరిగింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ ప్రస్తుతం 75.92 వద్ద ఉంది.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు ఇవాళ లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్​, ఐటీ, ఆటో రంగాల్లో కొనుగోళ్లు జరగడమూ లాభాలకు మరో కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఆరంభంలో 1300 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం 1245 పాయింట్ల లాభంతో 28,836 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 8 వేల 400 మార్కు దాటింది. 353 పాయింట్లు పెరిగి 8,437 వద్ద కొనసాగుతోంది.

శుక్రవారం నాటి ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 674, నిఫ్టీ 170 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

లాభనష్టాల్లో...

ఇండస్​ఇండ్​ బ్యాంకు సెన్సెక్స్​ ప్యాక్​లో ఉత్తమ లాభాలు నమోదుచేసింది. దాదాపు 15 శాతం పెరిగింది. మహీంద్రా అండ్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఇన్ఫోసిస్​ రాణించాయి.

బజాజ్​ ఫినాన్స్​ భారీగా నష్టపోయింది. ఐటీసీ, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఐషర్​ మోటార్స్​ కూడా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

ఇతర మార్కెట్లు...

ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంగ్​కాంగ్​, టోక్యో, సియోల్​లు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు కూడా సోమవారం లాభాల్లోనే ముగిశాయి.

ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు 2 శాతం మేర పెరిగి.. బ్యారెల్​కు 33.93 డాలర్ల వద్ద ఉంది.

రూపాయి..

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి 21 పైసలు పెరిగింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ ప్రస్తుతం 75.92 వద్ద ఉంది.

Last Updated : Apr 7, 2020, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.