ETV Bharat / business

మహీంద్రా భారీ 'రీకాల్​'- టాటా నుంచి కొత్త మోడల్స్ - టాటా సఫారీ ఎక్స్​టీఏ ప్లస్​ ధర

దేశీయ ఆటో మొబైల్ కంపెనీ ఎం&ఎం భారీ రీకాల్​ను ప్రకటించింది. అసెంబ్లింగ్​ లోపాల కారణంగా 29 వేలకుపైగా యూనిట్లను వెనక్కి పిలిపించాలని నిర్ణయించింది. మరో దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్​.. హారియర్​, సఫారీ మోడళ్ల కొత్త వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరలతో పాటు.. మహీంద్రా రీకాల్​ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

New SUVs from Tata motors
మహీంద్రా భారీ రీకాలు
author img

By

Published : Aug 10, 2021, 5:36 PM IST

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా (ఎం&ఎం) కీలక నిర్ణయం తీసుకుంది. 29,878 పికప్​ వాహనాలను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆయా వాహనాల అసెంబ్లింగ్​లో లోపాలు ఉన్నట్లు గుర్తించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వివరించింది.

2020 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి మధ్య తయారైన పికప్​ వాహనాల్లో మాత్రమే ఇలాంటి లోపం ఉన్నట్లు తెలిపింది ఎం&ఎం. రీకాల్ చేసిన వాహనాలకు ఉచితంగానే కావాల్సిన మరమ్మతులు చేయనున్నట్లు పేర్కొంది. సంబంధిత వాహనాల వినియోగదారులను కంపెనీనే నేరుగా సంప్రదిస్తుందని కూడా స్పష్టం చేసింది.

ఇప్పటికే రెండు సార్లు రీకాల్​..

ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు రీకాల్​ ప్రకటించింది ఎం& ఎం. వివిధ మోడళ్ల డీజిల్ వేరియంట్లలో సమస్యలను సరిచేసేందుకు.. గత నెలలోనే 600 యూనిట్లను రీకాల్ చేసింది.

ఫిబ్రవరిలోనూ ఇదే తరహాలో 1,577 థార్​ ఎస్​యూవీలను రీకాల్​ చేసి.. ఇంజిన్​లో లోపాలను సరిచేసింది ఎం&ఎం.

టాటా నుంచి కొత్త మోడల్స్​..

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్.. ఎస్​యూవీ సెగ్మెంట్​లోని హారియర్​, సఫారీ మోడళ్లలో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. హారియర్​ ఎక్స్​టీఏ+ ధరను రూ.19.14 లక్షలుగా, ఇదే మోడల్​ డార్క్ ఎడిషన్​ ధరను రూ.19.34 లక్షలుగా నిర్ణయించింది.

tata harrier xta plus
హారియర్​ ఎక్స్​టీఏ ప్లస్​

సఫారీ ఎక్స్​టీఏ+ ధరను రూ.20.09 లక్షలుగా ఉంచింది టాటా మోటార్స్​. (ధరలన్నీ దిల్లీ ఎక్స్​ షోరూం ప్రకారం)

tata safari xta plus
టాటా సఫారీ ఎక్స్​టీఏ ప్లస్​

ఈ రెండు రకాల కొత్త వేరియంట్లలో 6 స్పీడ్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​, సన్​ రూఫ్​ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

2 లీటర్ డీజిల్ ఇంజిన్, ప్రొజెక్టర్ హెడ్​ల్యాప్​, డ్యుయల్​ ఫంక్షన్​ ఎల్ఈడీ, ఆర్​ 17 అల్లోయ్​ వీల్స్​, ఆటోమేటిక్​ టెంపరేచర్ కంట్రోల్​ వంటి ఫీచర్లను ఈ మోడళ్లలో పొందుపరిచినట్లు టాటా మోటార్స్​ పేర్కొంది.

ఇదీ చదవండి: గడువులోపు ఆ పని చేయకుంటే మీ ఎస్​బీఐ అకౌంట్ క్లోజ్​!

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా (ఎం&ఎం) కీలక నిర్ణయం తీసుకుంది. 29,878 పికప్​ వాహనాలను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆయా వాహనాల అసెంబ్లింగ్​లో లోపాలు ఉన్నట్లు గుర్తించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వివరించింది.

2020 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి మధ్య తయారైన పికప్​ వాహనాల్లో మాత్రమే ఇలాంటి లోపం ఉన్నట్లు తెలిపింది ఎం&ఎం. రీకాల్ చేసిన వాహనాలకు ఉచితంగానే కావాల్సిన మరమ్మతులు చేయనున్నట్లు పేర్కొంది. సంబంధిత వాహనాల వినియోగదారులను కంపెనీనే నేరుగా సంప్రదిస్తుందని కూడా స్పష్టం చేసింది.

ఇప్పటికే రెండు సార్లు రీకాల్​..

ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు రీకాల్​ ప్రకటించింది ఎం& ఎం. వివిధ మోడళ్ల డీజిల్ వేరియంట్లలో సమస్యలను సరిచేసేందుకు.. గత నెలలోనే 600 యూనిట్లను రీకాల్ చేసింది.

ఫిబ్రవరిలోనూ ఇదే తరహాలో 1,577 థార్​ ఎస్​యూవీలను రీకాల్​ చేసి.. ఇంజిన్​లో లోపాలను సరిచేసింది ఎం&ఎం.

టాటా నుంచి కొత్త మోడల్స్​..

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్.. ఎస్​యూవీ సెగ్మెంట్​లోని హారియర్​, సఫారీ మోడళ్లలో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. హారియర్​ ఎక్స్​టీఏ+ ధరను రూ.19.14 లక్షలుగా, ఇదే మోడల్​ డార్క్ ఎడిషన్​ ధరను రూ.19.34 లక్షలుగా నిర్ణయించింది.

tata harrier xta plus
హారియర్​ ఎక్స్​టీఏ ప్లస్​

సఫారీ ఎక్స్​టీఏ+ ధరను రూ.20.09 లక్షలుగా ఉంచింది టాటా మోటార్స్​. (ధరలన్నీ దిల్లీ ఎక్స్​ షోరూం ప్రకారం)

tata safari xta plus
టాటా సఫారీ ఎక్స్​టీఏ ప్లస్​

ఈ రెండు రకాల కొత్త వేరియంట్లలో 6 స్పీడ్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​, సన్​ రూఫ్​ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

2 లీటర్ డీజిల్ ఇంజిన్, ప్రొజెక్టర్ హెడ్​ల్యాప్​, డ్యుయల్​ ఫంక్షన్​ ఎల్ఈడీ, ఆర్​ 17 అల్లోయ్​ వీల్స్​, ఆటోమేటిక్​ టెంపరేచర్ కంట్రోల్​ వంటి ఫీచర్లను ఈ మోడళ్లలో పొందుపరిచినట్లు టాటా మోటార్స్​ పేర్కొంది.

ఇదీ చదవండి: గడువులోపు ఆ పని చేయకుంటే మీ ఎస్​బీఐ అకౌంట్ క్లోజ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.