ETV Bharat / business

'హెల్త్​కేర్ సెక్టార్​లో పెట్టుబడులు భారీగా పెరగాలి'

author img

By

Published : Jul 11, 2020, 5:59 PM IST

కరోనా సృష్టించిన ఈ సంక్షోభాన్ని ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం అవకాశంగా మలుచుకోవాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. దేశంలో ప్రస్తుత ఆరోగ్య రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముందని అంటున్నారు.

healthcare-spends
హెల్త్​కేర్​పై పెట్టుబడులు పెరగాలి

దేశంలో కరోనాతో నెలకొన్న సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ప్రభుత్వం ఆరోగ్య రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. అదే విధంగా 2023 నాటికి దేశంలో మురికి వాడలు లేని పట్టణాలు రూపొందించడం ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకోవాలని అంటున్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ నిర్వహించిన ఆర్థిక సదస్సులో ఈ విషయంపై చర్చించారు ఆర్థికవేత్తలు, నిపుణులు.

చరిత్రలో భారత్​ ఎప్పుడు ఆరోగ్య రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టలేదని యేల్​ యూనివర్సిటీ ప్రతినిధి రోహిణి పాండే అన్నారు. ఇప్పుడు కూడా అందులో పెట్టుబడులు పెద్దగా పెరగటం లేదని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలన్న ఆమె.. ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు ఇది ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు.

ప్రస్తుత పరిస్థితిని అవకాశంగా మార్చుకుని దేశీయంగా హెల్త్​కేర్ సెక్టార్​లో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఎస్​బీఐ ముఖ్య ఆర్థికవేత్త ఎస్​.కే.గోష్​ పిలుపునిచ్చారు. రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో రూ.60 వేల కోట్లతో 500 పడకల ఆస్పత్రులను నిర్మించాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఎస్​బీఐ ఛైర్మన్ రజనీశ్​ కుమార్ సహా ప్రముఖ ఆర్థికవేత్తలు, దేశవ్యాప్తంగా ప్రధాన యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'గత వందేళ్లలో కరోనానే అతిపెద్ద సంక్షోభం'

దేశంలో కరోనాతో నెలకొన్న సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ప్రభుత్వం ఆరోగ్య రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. అదే విధంగా 2023 నాటికి దేశంలో మురికి వాడలు లేని పట్టణాలు రూపొందించడం ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకోవాలని అంటున్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ నిర్వహించిన ఆర్థిక సదస్సులో ఈ విషయంపై చర్చించారు ఆర్థికవేత్తలు, నిపుణులు.

చరిత్రలో భారత్​ ఎప్పుడు ఆరోగ్య రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టలేదని యేల్​ యూనివర్సిటీ ప్రతినిధి రోహిణి పాండే అన్నారు. ఇప్పుడు కూడా అందులో పెట్టుబడులు పెద్దగా పెరగటం లేదని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలన్న ఆమె.. ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు ఇది ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు.

ప్రస్తుత పరిస్థితిని అవకాశంగా మార్చుకుని దేశీయంగా హెల్త్​కేర్ సెక్టార్​లో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఎస్​బీఐ ముఖ్య ఆర్థికవేత్త ఎస్​.కే.గోష్​ పిలుపునిచ్చారు. రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో రూ.60 వేల కోట్లతో 500 పడకల ఆస్పత్రులను నిర్మించాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఎస్​బీఐ ఛైర్మన్ రజనీశ్​ కుమార్ సహా ప్రముఖ ఆర్థికవేత్తలు, దేశవ్యాప్తంగా ప్రధాన యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'గత వందేళ్లలో కరోనానే అతిపెద్ద సంక్షోభం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.