రష్యాకు చెందిన కరోనా టీకా స్పుత్నిక్-వీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతినిచ్చింది. ఈ మేరకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ వెల్లడించింది. రెండు దశల క్లినికల్ ట్రయల్స్ భద్రతా సమాచారాన్ని డేటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్(డీఎస్ఎంబీ) సమీక్షించి.. మూడో దశ ప్రయోగాలకు అనుమతినివ్వాలని డీసీజీఐకి సిఫారసు చేసింది. భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు లేవని... వ్యాక్సిన్ సురక్షిత ప్రమాణాలను అందుకుందని డీఎస్ఎంబీ నివేదించింది.
రష్యా అభివృద్ధి చేసిన ఈ టీకాను దేశంలో ఉత్పత్తి చేసేందుకు.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ ఒప్పందం కుదుర్చుకుంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ను ఈ నెలలోనే పూర్తి చేసి, దేశ ప్రజలకు సురక్షితమైన వ్యాక్సిన్ను అందించేలా చర్యలు తీసుకుంటామని రెడ్డీస్ తెలిపింది.
ఇదీ చూడండి: వ్యాక్సినేషన్కు సర్వం సిద్ధం- ఇవి గుర్తుంచుకోండి